మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ హీరోగా కిశోర్ తిరుమల డైరక్షన్ లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన సినిమా చిత్రలహరి. కళ్యాణి ప్రియదర్శి, నివేదా పేతురాజ్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ఫస్ట్ టాక్ పర్వాలేదు అన్నట్టుగా ఉంది.


అయితే తేజ్ ఆశించిన ఫలితాన్ని ఇస్తుందా లేదా అన్నది మాత్రం సాయంత్రం వరకు తెలుస్తుంది. చిత్రలహరి సినిమా టాక్ ను బట్టి ఆల్రెడీ సక్సెస్ సాధించిన మజిలీ చిత్ర వసూళ్లు ఆధారపడి ఉన్నాయి. నాగ చైతన్య, సమంత, దివ్యాన్ష కౌశిక్ నటించిన మజిలీ సినిమా ఏప్రిల్ 5న రిలీజై సూపర్ హిట్ కొట్టింది.


ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్స్ ను లాభాల బాట పట్టించిన మజిలీ చిత్రలహరి టాక్ ను బట్టి మరింత రెచ్చిపోయే అవకాశం ఉంది. సాయి ధరం తేజ్ చిత్రలహరి మీద చాలా హోప్స్ పెట్టుకున్నాడు. సినిమా కథ, కథనాలు యూత్ ఆడియెన్స్ కు నచ్చేలా ఉన్నా అనుకున్న రేంజ్ లో లేవన్నది ప్రీమియర్స్ నుండి వస్తున్న టాక్.


బాక్సాఫీస్ ఫైట్ లో వారం ముందు రిలీజైన మజిలీ.. వారం తర్వాత ఈరోజు వస్తున్న తేజ్ చిత్రలహరి పోటీ పడుతున్నాయి. అయితే తేజ్ ఇదవరకు ఫ్లాప్ సినిమాల్లా ఘోరంగా అయితే ఈ సినిమా లేదన్నది టాక్. మరి చిత్రలహరి అసలు టాక్ ఏంటన్నది ఈవినింగ్ వరకు తెలుస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో హిట్ టాక్ వస్తే మాత్రం తేజూ మళ్లీ ఫాంలోకి వచ్చినట్టే.



మరింత సమాచారం తెలుసుకోండి: