ఇందులో నయనతార కథానాయికగా నటించనున్నారు. ఇద్దరు కలిసి ఇప్పటికి రెండు చిత్రాల్లో నటించారు.ఇంతకుముందు ‘చంద్రముఖి, కథానాయకుడు సినిమాల్లో రజనీకాంత్తో కలిసి సిల్వర్స్క్రీన్ను షేర్ చేసుకున్నారు నయనతార. ఇక ‘దర్బార్’ ఫస్ట్ లుక్ను బట్టి ఈ సినిమాలో రజనీ పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు ఇరవైఏళ్ల తర్వాత పోలీస్ పాత్రలో నటిస్తున్నారట రజనీ. అలాగే ఫస్ట్ లుక్ పోస్టర్ బ్యాగ్రౌండ్లో ‘గేట్ వే ఆఫ్ ఇండియా’ కనిపిస్తోంది.
కాబట్టి ఇది ముంబై నేపథ్యంలో సాగే కథాంశమని కన్ఫార్మ్ చేసుకోవచ్చు.మురుగదాస్ ‘తుపాకీ’, రజనీకాంత్ ఇటీవలి ‘కాలా’ చిత్రాలు ముంబై నేపథ్యంలోనే సాగాయన్న సంగతి తెలిసిందే. ‘దర్బార్’ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. సంతోష్ శివన్ ఛాయాగ్రాహకులు.