బాలీవుడ్  హీరోయిన్స్ అలియాభట్ కంగన రనౌత్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పెరిగిపోతున్న దూరం ఇప్పుడు మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. గత కొద్దికాలంగా వారిద్దరూ ఒకరిపై మరొకరు ఘాటైన సెటైర్లు వేసుకుంటున్నారు. ‘మణికర్ణిక’ సినిమాతో జోష్ మీద ఉన్న కంగన లేటెస్ట్ గా అలియాభట్ నటించిన ‘గల్లీభాయ్’ సినిమా పై తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ అత్యంత వివాదాస్పదంగా మారాయి. 

ఈ మధ్య బాలీవుడ్ లో అవార్డుల కార్యక్రమాలు విపరీతంగా జరుగుతున్నాయి.  ఈఅవార్డుల కోసం ‘మణికర్ణిక’ సినిమాతో ‘గల్లీభాయ్’ పోటీ పడుతోంది. ఒక ప్రముఖ మీడియా సంస్థ కంగనా రనౌత్ కు ‘మణికర్ణిక’ సినిమాలో ఆమె అద్భుత నటనకు మెచ్చి ఉత్తమనటి అవార్డు ఇచ్చింది. ఈ సందర్భంలో ఒక మీడియా సంస్థ ప్రతినిధి అలియాభట్‌ నుంచి గట్టిపోటీ ఎదురైందా అనే ప్రశ్నకు జవాబిస్తూ  అలియా అంత గొప్పనటి అని భావిస్తున్నారా అంటూ షాకింగ్ రిప్లై ఇచ్చింది.   

అంతేకాదు హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలకు తాను చిరునామాగా కొనసాగుతున్నానని తాను చేసే పాత్రల స్థాయి అలియా భట్ కు లేదు అంటూ కామెంట్స్ చేసింది. అంతేకాదు తాను త్వరలో ‘బాహుబలి’ రేజ్ కి మించిన సినిమాలో నటించబోతున్నాను అంటూ ఏకంగా రాజమౌళికే షాక్ ఇచ్చింది. ఇది ఇలా ఉండగా ఈమె ప్రస్తుతం నటిస్తున్న ‘మెంటల్ హై క్యా’ మూవీ పై చాల అంచనాలు ఉన్నాయి. 

వచ్చే మే నెలలో విడుదల కాబోతున్న ఈమూవీ అలియా భట్ ప్రస్తుతం నటిస్తున్న ‘కళంక్’ మూవీల మధ్య పోటీ బాలీవుడ్ మీడియాకు ఆసక్తిదాయకంగా మారింది. ఇలాంటి పరిస్థుతులలో ప్రస్తుతం ఈ రెండు సినిమాల  ప్రమోషన్ మధ్య అలియా భట్ కంగనా రనౌత్ లు చాల బజీగా ఉన్నారు. ఇలాంటి పరిస్థుతులలో కంగన కేవలం అలియా భట్ ను మాత్రమే కాకుండా రాజమౌళి ‘బాహుబలి’ ని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేయడం బాలీవుడ్ మీడియాకు హాట్ టాపిక్ గా మారింది..   


మరింత సమాచారం తెలుసుకోండి: