గుంటూరు పెదకాకాని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రూ.1.32 కోట్ల విరాళమిచ్చారు.


ఆలయంలో జరిగే నిత్యాన్నదానానికి ఆ కోట్ల రూపాయల ధనంను ఉపయోగించవలసిందిగా కోరుతూ ఆలయ ధర్మకర్తలకు చెక్కును అందజేశారు పవన్ కళ్యాణ్.


నాకు ఆకలి బాధ తెలుసు, నేను కానిస్టేబుల్ కొడుకుని, నేను నడుస్తూ..సిటీ బస్సుల్లో తిరిగా.. నాకు మద్య తరగతి కష్టాలు తెలుసు అని గుండెల్లొ  ఆవేదనని వెలిబుచ్చుతూ పవన్ స్టార్ చేసిన ప్రసంగాలు ఖాళీ ప్రసంగాలే కాదు..అని చేతల్లో నిరూపించారు మా పవర్ స్టార్ అంటున్నారు పవన్ అభిమానులు.


దేవదేవుడు వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో అన్నదాన పధకంలో పవర్ స్టార్ పాలు పంచుకోవడం ముదావహం అంటున్నారు భక్తులు. ఏదేమయినా.. మా PSPK ఎప్పుడూ రీల్ మీదయినా - రియల్ లైఫ్ లోనయినా హీరోనే అంటున్నారు  మెగా పవర్ స్టార్ అభిమానులు. 


ఇంత మంచి కార్యక్రమంలో పవర్ స్టార్ భాగమయినందుకు ఇండియాహెరాల్డ్ గ్రూప్ పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: