టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎంతో మంది స్టార్ హీరోల తనయులు హీరోలుగా వచ్చారు. ఈ క్రమంలోనే రెబల్ స్టార్ కృష్ణం రాజు సోదరుడి తనయుడు ప్రభాస్ ‘ఈశ్వర్’సినిమాతో మాస్ హీరోగా పరిచయం అయ్యాడు. ఒడ్డూపొడవు..హీరోకి ఉండాల్సిన లక్షణాలు ప్రభాస్ లో కొట్టొచ్చినట్లు కనిపించడంతో దర్శకధీరుడు రాజమౌళి అతనికి ‘చత్రపతి’లాంటి బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ఇచ్చాడు. అప్పటి నుంచి ప్రభాస్ రేంజ్ పెరిగిపోయింది..మాస్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యాడు.
మిర్చి సినిమా తర్వాత మరోసారి రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ లోనే కనీ వినీ ఎరుగని రీతిలో ‘బాహుబలి, బాహుబలి2’ సినిమాలు వచ్చాయి. అప్పటి వరకు టాలీవుడ్ కే పరిమితం అయిన ప్రభాస్ ఉన్నట్టుండి నేషనల్ ఫిగర్ అయ్యాడు. జాతీయ స్థాయిలోనే కాదు బాహుబలి అంటే ప్రపంచస్థాయిలో గుర్తింపు దక్కింది. ఇప్పుడు ప్రభాస్ తదుపరి సినిమా కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ‘సాహో’ సినిమాతో రెబల్ స్టార్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే సోషల్ మీడియాలో చాలా తక్కువగా కనిపించే ప్రభాస్ ఇప్పుడు కొత్త ఎకౌంట్ లను క్రియేట్ చేసుకుంటున్నాడు.
ఇక ఫెస్ బుక్ ఎకౌంట్ లో అప్పుడపుడు అభిమానులకు తన వివరణను ఇచ్చే ప్రభాస్ నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ లో కూడా సందడి చేయడానికి సిద్దమవుతున్నాడు. అయితే ఫేస్ బుక్ లోనే మనోడికి కోటికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు..ఇక ఇన్స్టాగ్రామ్ కి అభిమానుల సంఖ్య పెరుగుతోంది. ఒక్క పోస్ట్ కూడా చేయలేదు అప్పుడే ఫాలోవర్స్ సంఖ్య దాదాపు 7 లక్షలోకి వచ్చేస్తోంది. అదే ప్రభాస్ దెబ్బ అంటే అంటున్నారు హార్డ్ కోర్ ఫ్యాన్స్.