‘మహర్షి’ మూవీలోని రెండవ పాట విడుదలైంది ‘నువ్వే సమస్తం..నువ్వే సిద్దాంతం నువ్వే నీ పంతం నువ్వేలే అనంతం’ అంటూ సాగే ఈపాటను గేయ రచయిత శ్రీమణి రచించాడు. ‘శ్రీమంతుడు’ మూవీలోని ‘పోరా శ్రీమంతుడా పో పోరా శ్రీమంతుడా’ పాటలా అందరికీ కనెక్ట్ అవ్వాలని చేసిన ప్రయత్నం కనిపించినా ఈపాట ఎవరికీ అర్ధంకాని పాటగా మారిందని కామెంట్స్ వస్తున్నాయి. 

బీట్ ప్రధానంగా సాగిన ఈ పాటలో సాహిత్యాన్ని ట్యూన్ కోసం ఎన్ని ముక్కలుగా విరిచేయాలో అన్ని ముక్కలుగా దేవీశ్రీప్రసాద్ విరిచేయడంతో ఈపాట యూత్ కు మాత్రమే కాదు మహేష్ అభిమానులకు కూడ నచ్చని విధంగా మారినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈసినిమాకు సంబంధించి విడుదలైన మొదటి పాట ‘చోటి చోటి బాతిన్’ చెప్పుకోతగ్గ స్థాయిలో హిట్ కాలేదు. 

ఇప్పుడు ఈసినిమాకు సంబంధించిన రెండవ పాటకు కూడ నెగిటివ్ కామెంట్స్ వస్తున్న నేపధ్యంలో ‘మహర్షి’ ఆడియో ఫెయిల్ అవుతుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. టాప్ హీరోల సినిమాల విజయంలో ఆడియో ఫెయిల్ అయితే చాల భయంకరమైన నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి. ఇప్పటికే ‘మహర్షి’ సినిమా విషయంలో రకరకాల గాసిప్పులు వస్తున్న నేపధ్యంలో ఈమూవీ రెండవ పాట కూడ అందరికీ అంతగా నచ్చకపోవడం హాట్ టాపిక్ గా మారింది. 

ఈమూవీకి 140 కోట్ల బిజినెస్ అయింది అని వార్తలు వస్తున్న నేపధ్యంలో ఈమూవీని అభిమానులు మాత్రమే కాకుండా సాధారణ ప్రేక్షకులు కూడ ఒకటికి రెండు సార్లు చూసినప్పుడు మాత్రమే ‘మహర్షి’ బ్లాక్ బస్టర్ హిట్ గా మారుతుంది. ఇప్పటికే ‘మహర్షి’ కి మహేష్ మే నెల నెగిటివ్ సెంటిమెంట్ వెంటాడుతున్న పరిస్తుతులతో పాటు ఈమూవీ ఆడియో ఫెయిల్ అయితే పరిస్థితి ఏమిటి అన్న కోణంలో బయ్యర్లలో టెన్షన్ మొదలైనట్లు టాక్..   


మరింత సమాచారం తెలుసుకోండి: