ఈ మద్య సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్,  మీ టూ ఉద్యమాలు ఊపందుకుంటున్నాయి.  టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పై నటి శ్రీరెడ్డి ఓ సంచలనం సృష్టించింది.  ఇక మీ టూ ఉద్యమం బాలీవుడ్ లో తనూశ్రీ దత్తా, కంగనా రౌనత్ లు సంచలనాలు రేపితే..దక్షిణాదిన ప్రముఖ సింగర్ చిన్మయి పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టింది. అయితే ఇలాంటి ఉద్యమాలు తీసుకు వచ్చిన వారిపై వత్తళ్లు కూడా బాగానే పెరిగిపోయాయి.  తెలుగు లో శ్రీరెడ్డి చేపట్టిన కాస్టింగ్ కౌచ్ వల్ల ఆమె ఇప్పుడు తెర చాటున ఉండాల్సిన పరిస్థితి..ప్రస్తుతం చెన్నైలో ఉంటుంది.  ఇక సింగర్ చిన్మయి పై కూడా రక రకాలుగా ఎటాక్ లు జరిగినట్లు పలు సందర్భాల్లో ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. 

 విదేశాల్లో ఓ ఈవెంట్ కి వెళ్లినప్పుడు తనని గదికి రమ్మని పిలిపించాడని చిన్మయి మీటూ క్యాంపెయినింగ్ వేదికగా ఆరోపించారు. దానిపై విచారణ సాగాలని చిన్మయి మీడియకి ఎక్కారు. ఈ విషయంలో తన భర్త రాహుల్ రవీంద్రన్ సైతం తనకు అండగా నిలిచిన సంగతి తెలిసిందే.  అయితే చిన్మయి ఆరోపణలకు వైరముత్తు కూడా కౌంటర్ వేశారు.  తన ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని ఖండించడంతో ఆయన అభిమానులు సైతం ఇంత ఆలస్యంగా స్పందించారేం? పదేళ్ల క్రితమే ఎందుకు ఫిర్యాదు చేయలేదు? అంటూ చిన్మయిని ప్రశ్నించారు. 

గత కొంత కాలంగా వీరి మద్య మాటల యుద్దం కొనసాగుతూనే ఉంది..ఈ వివాదం ఇప్పటికీ సద్ధుమణగలేదు. తాజాగా మరోసారి వైరముత్తుపై సంచలన వ్యాఖ్యలు చేసింది చిన్మయి. సామాజిక మాధ్యమాల వేదికగా ఓ నెటిజనుతో జరిగిన సంభాషణలో ``ఈసారి వైరముత్తు కనిపిస్తే చెంప చెల్లుమనిపిస్తాను`` అంటూ వ్యాఖ్యానించడం సంచలనమైంది.

ఈ మద్య ఓ మీటింగ్ కి హాజరవుతున్న ఖుష్బు పట్ల ఓ యువకుడు తాకరాని చోట తాకడంతో వెంటనే వాడి చెంప చెల్లుమనిపించింది. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ``కచ్చితంగా.. ఈ సారి నాకు వైరముత్తు కనిపిస్తే తప్పకుండా చెంప చెళ్లుమనిపించాలన్న విషయం గుర్తు పెట్టుకుంటా అంటూ చిన్మయి చేసిన వ్యాఖ్యలపై వైరముత్తు అభిమానుల ప్రతిస్పందన ఎలా ఉంటుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: