మెగా మేనళ్లుడు సాయిధరమ్ తేజ్ తాజా సినిమా చిత్రలహరికి మిశ్రమ స్పందన లభించింది. ఈ సినిమాకు క్రిటిక్స్తో పాటు ప్రేక్షకుల నుంచి విమర్శలే వచ్చాయి. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సాయి సరసన హలో ఫేమ్ కళ్యాణి ప్రియదర్శిని, నివేత సేతురాజ్ హీరోయిన్లుగా నటించారు. సినిమాకు టాక్ బాగో లేకపోవడంతో తొలి రోజు కలెక్షన్లు కలెక్షన్లు ఆశాజనకంగా లేవు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో చిత్రలహరి రూ.3 కోట్ల షేర్ రాబట్టింది. ఓవర్సీస్లో మాత్రం చిత్రలహరి ఘోరమైన ప్రదర్శన చేసింది. యుఎస్ ప్రీమియర్ల నుంచి కేవలం $63K మాత్రమే వసూలు చేసిన చిత్రలహరి ఆపై పెద్దగా పికప్ చూపించలేదని ఫిగర్స్ చెబుతున్నాయి. ఓవర్సీస్ టాక్ను బట్టి చూస్తే తేజుకు వరుసగా ఏడో ప్లాప్ పడినట్టే. ఇక రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత మైత్రికి సవ్యసాచి-అమర్ అక్బర్ అంటోనీ ఇప్పుడు చిత్రలహరి రూపంలో వరుసగా మూడో ఎదురు దెబ్బ తగిలినట్టే అనుకోవాలి.
చిత్రలహరి ఫస్ట్ డే ఏరియా వైజ్ కలెక్షన్స్ (రూ.కోట్లలో)
నైజాం - 0.79
సీడెడ్ - 0.51
ఉత్తరాంధ్ర - 0.42
ఈస్ట్ - 0.38
కృష్ణా - 0.24
గుంటూరు - 0.30
వెస్ట్ - 0.24
నెల్లూరు - 0.14
--------------------------------------
ఏపీ + తెలంగాణ = 3.02 కోట్లు
---------------------------------------