మహేష్ త్రివిక్రమ్ ల మధ్య ఒక మూవీ ఉంటుంది అన్నప్రచారం ఎప్పటి నుంచో జరిగినా అది వాస్తవ రూపం దాల్చలేదు దీనికితోడు ‘ఖలేజా’ ఫెయిల్యూర్  తరువాత వీరిద్దిరి మధ్య గ్యాప్ ఏర్పడింది అన్నవార్తలు కూడ అప్పట్లో వచ్చాయి. దీనికితోడు త్రివిక్రమ్ కు ఎంతో సన్నిహితమైన హారిక హాసిని సంస్థ మహేష్ కు ఇచ్చిన అడ్వాన్స్ వెనక్కు తీసుకోవడంతో  మహేష్ హర్ట్ అయ్యాడని వార్తలు కూడ వచ్చాయి. 

దీనితో త్రివిక్రమ్ తో సినిమా చేసే ఆలోచన ఇంచుమించు మహేష్ విరమించుకున్నట్లుగానే సంకేతాలు వచ్చాయి. ఇది ఇలా ఉండగా ఇప్పుడు ఉన్నట్లు ఉండి త్రివిక్రమ్ మళ్లీ మహేష్ తో కలిసి ఒక యాడ్ షూటింగ్ చేయడం వెనుక పెద్ద కథ నడిచినట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీ వర్గాలలో ఈవిషయమై వినపడుతున్న వార్తల ప్రకారం మహేష్ తో ఆ యాడ్ నిర్మిస్తున్న కంపెనీ వర్గాలు ఫలానా డైరెక్టర్ కావాలని అడగలేదు అని తెలుస్తోంది. 

కానీ మహేష్ బాబు స్వయంగా త్రివిక్రమ్ పేరు సూచించినట్లు టాక్. అంతేకాదు మహేష్ భార్య నమ్రత స్వయంగా త్రివిక్రమ్ కు ఫోన్ చేసి ఈ యాడ్ చేయవలసిందిగా కోరడంతో త్రివిక్రమ్ కాస్త ఆశ్చర్య పోయినట్లు తెలుస్తోంది. ఇలా మహేష్ ప్రవర్తించడం వెనుక ఒక కారణం ఉంది అని అంటున్నారు. 

ప్రస్తుతం మహేష్ కు టాప్ డైరెక్టర్ల అవసరం చాల ఉంది. సుకుమార్ తో చేయవలసిన సినిమా క్యాన్సిల్ కావడంతో మహేష్ ప్రస్తుతం లైన్ లో పెట్టిన అనీల్ రావిపూడి సినిమా ప్రాజెక్ట్ తరువాత మరి ఏ పెద్ద ప్రాజెక్ట్ చేతిలో లేదు. దీనితో ముందు చూపుతో వచ్చే ఏడాది గ్యాప్ లేకుండా సినిమాలు చేయడానికి ముందుగానే త్రివిక్రమ్ ను నమ్రత ద్వారా మహేష్ లైన్ లో పెడుతున్నాడు అంటూ కామెంట్స్ వస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: