సూపర్ స్టార్ మహేష్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో మహేష్ 25వ సినిమాగా భారీ అంచనాలతో వస్తున్న సినిమా మహర్షి. దిల్ రాజు, అశ్వైదత్, పివిపి ముగ్గురు బడా నిర్మాతలు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. అల్లరి నరేష్ కూడా ఈ సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు.


ఈమధ్య రిలీజైన టీజర్ సినిమాపై మరింత అంచనాలు పెంచింది. మే 9న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ ప్లాన్ చేసిన మహర్షి సినిమా వరల్డ్ వైడ్ గా ప్రీ రిలీజ్ బిజినెస్ అదరగొడుతుంది. మహేష్ కెరియర్ లో హయ్యెస్ట్ బిజినెస్ మహర్షి చేసింది. ఇప్పటికే ఓవర్సీస్ లో 12.50 కోట్లు బిజినెస్ చేసిన మహర్షి థియేట్రికల్ బిజినెస్ 94.5 కోట్లు చేసిందని తెలుస్తుంది.


అంతేకాదు డబ్బింగ్, డిజిటల్, శాటిలైట్, ఆడియో ఇలా అన్ని రైట్స్ కలుపుకుంటే మహర్షి అత్యధికంగా 141.50 కోట్ల దాకా బిజినెస్ చేసిందని తెలుస్తుంది. మహేష్ స్టామినాకు తగినట్టుగా ఈ ప్రీ రిలీజ్ బిజినెస్ ఉంది. ఇక సినిమా రిలీజై హిట్ టాక్ తెచ్చుకుంది అంటే ఇక సూపర్ స్టార్ హంగామా మొదలైనట్టే.


ఈ సినిమా తర్వాత మహేష్ అనీల్ రావిపుడి డైరక్షన్ లో ఓ సినిమా చేయాలని చూస్తున్నాడు. మే లో మహర్షి రిలీజ్ కాగానే జూన్ నుండే ఆ సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారట. దిల్ రాజు, అనీల్ సుంకర ఆ సినిమా నిర్మిస్తారని తెలుస్తుంది. మొత్తానికి మహేష్ స్పీడ్ కు ఘట్టమనేని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: