‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదల అయ్యాక  రామరావు జీవితంలో బయటి ప్రపంచానికి తెలియని చాలా విషయాల గురించి ప్రజలలో ఆసక్తి పెరిగింది. ఇలాంటి పరిస్థితులలో ఎన్టీ రామారావు వద్ద సన్నిహితంగా నమ్మకంగా ఎన్నో సంవత్సరాలు పనిచేసిన డ్రైవర్ లక్ష్మణ్ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలు తెలియచేసాడు. హరికృష్ణతో పాటు ఎన్టీఆర్ చైతన్య రధం నడిపిన వ్యక్తి లక్ష్మణ్. 

ఎన్టీఆర్ తన కొడుకులు అందరి గురించి తెగ మధన పడే వారనీ తనతో కూడ ఆవిషయాలు చెప్పుకుని బాధపడిన సందర్భాలను వివరించాడు లక్ష్మణ్.  ఎన్టీఆర్ కొడుకులు ఎన్టీఆర్ లా దూసుకుపోయే మనస్తత్వం ఉన్నవారు కాదనీ ఒక్క బాలకృష్ణకు తప్పించి మరెవ్వరికీ కష్టపడే మనస్థత్వం తక్కువ అనీ ఎన్టీఆర్ జీవించి ఉన్న రోజులలో తెగ బాధపడుతూ ఉండేవారని అప్పటి విషయాలను గుర్తుకు తెచ్చుకున్నాడు. 

ముఖ్యంగా ఎన్టీఆర్ మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు తన కొడుకులలో ఎవరో ఒకరిని ఒక పారిశ్రామిక వేత్తగా ఎదిగేల చేసి కనీసం 10 వేలమందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగమని ఎంత ప్రోత్సహించినా ఆవిషయాలను అప్పట్లో ఎన్టీఆర్ కుమారులు పట్టించుకునే వారు కాదనీ అప్పటి విషయాలను లక్ష్మణ్ ఇప్పుడు గుర్తుకు చేసుకుంటున్నాడు. అంతేకాదు ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతిని పెళ్ళి చేసుకోకముండు ఆయన విషయాలను పట్టించుకున్న సందర్భాలు చాల అరుదు అంటూ ఎన్టీఆర్ కు సంబంధించిన మరొక విషయాన్ని లీక్ చేసాడు. 

అంతేకాదు ఎన్టీఆర్ కొడుకులలో చాలామంది ఎన్టీఆర్ అంచనాలను చేరుకోలేక పోయారని బాలకృష్ణ నటుడుగా ఎదిగినా ఎన్టీఆర్ జీవించి ఉన్న రోజులలో బాలయ్య పై కూడ ఎన్టీఆర్ కు అసంతృప్తి ఉంది అన్న విషయాలను గుర్తుకు చేసుకున్నాడు. వాస్తవానికి ఈవిషయాలు అన్నీ ఎంతో ఆసక్తిదాయకంగా అనిపించినా తెలుగు వారి గుండెలలో ఇప్పటికీ ఒక శాశ్విత స్థానాన్ని ఏర్పరుచుకున్న ఎన్టీఆర్ జీవితం పై ఇలా వివాదాస్పద సినిమాలు అప్పట్లో ఎన్టీఆర్ తో సన్నిహితంగా ఉండే వ్యక్తులతో ఇంటర్వ్యూలు వస్తున్న నేపధ్యంలో నిజమైన నందమూరి అభిమానులకు జరుగుతున్న పరిణామాలు మరిచిపోలేని విషయాలుగా మారాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: