ఎప్పుడు కలిసి ఉండే మెగా హీరోలు బన్నీ, చెర్రీలు డిష్యుం డిష్యుం అంటూ పోట్లాడుకోనున్నారా... అంటే అవును అనే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. వారిద్దరి మద్య సినిమాలే చిచ్చుపెట్టబోతున్నాయి అంటున్నారు. అదే జరిగితే మెగా పరివారం పరువు పోవడం ఖాయం అని కూడా అంటున్నారు.

బన్నీ ఇప్పుడ ‘రేసుగుర్రం’ సినిమాను సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తన ప్రాణమంతా పెట్టి తీస్తున్నాడు. ‘ఇద్దరమ్మాయిలతో’ పోయిన పరువును ఈ సినిమాతో నిలబెట్టుకోవాలని తాపత్రయ పడుతున్నాడు. వీలైనంత త్వరగా పూర్తి చేసి సంక్రాంతికి విడుదల చేయాలని బావిస్తున్నాడు బన్నీ.

అలాగే కృష్ణ వంశీ డైరెక్షన్ లో వెంకటేష్, సూపర్ స్టార్ క్రిష్ణా లతో కలిసి చెర్రీ మల్టీ స్టారర్ సినిమా తీస్తున్నాడు. రాంచరణ్ కూడా తూఫాన్ తో పోయిన ప్రతిష్టను ఈ సినిమాతో సంపాదించుకోవాలనుకుంటున్నాడు. ఈ సినిమాను కూడా సంక్రాంతికే విడుదల చేయాలని నిర్ణయించుకున్నాడట. అంటే బన్నీకి పోటీగా చెర్రీ వస్తే ఇక వారిమద్య సయోధ్య ఎలా ఉంటుంది, ఎవడు రిలీజ్ డేట్ తో ఇంతకు ముందు బాబాయితో, ఇప్పుడు బన్నీతో విబేధాలు కొని తెచ్చుకుంటున్నాడు రాంచరణ్ అన్న టాక్ మాత్రం వినిపిస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: