వివాదాలకు వీలైనంత దూరంలో ఉంటాడు ప్రభాస్. అలాంటి వ్యక్తి విజయ్ దేవరకొండ నటించిన ‘అర్జున్ రెడ్డి’ మూవీ పై కామెంట్స్ చేసాడు అంటూ ఈరోజు ఒక ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. ఆసక్తికరమైన ఈన్యూస్ వివరాలలోకి వెళితే విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’ సినిమా కంటే ఆమూవీ హిందీ రీమేక్ ‘కబీర్ సింగ్’ మూవీలో షాహిద్ కపూర్ నటన బాగుంది అని ప్రభాస్ కామెంట్స్ చేసినట్లుగా ఆపత్రిక తన కథనంలో పేర్కొంది. 

అంతేకాదు ‘అర్జున్ రెడ్డి’ మూవీ కన్నా కబీర్ సింగ్ రీమేక్ చాల బాగా వచ్చిందని ప్రభాస్ తన అభిప్రాయాన్ని ఈమూవీ హీరో షాహిద్ కపూర్ కు వ్యక్తిగతంగా ఫోన్ లో చెప్పినట్లు ఆ కథనం సారాంశం. అయితే ప్రభాస్ వ్యక్తిగతంగా షాహిద్ కపూర్ కు చేసిన ఫోన్ వివరాలు ఎలా బయటకు వచ్చాయి అన్న విషయమై ఆపత్రిక క్లారిటీ ఇవ్వలేకపోయింది. 

అయితే ప్రభాస్ ప్రశంసలకు పొంగిపోయినా హీరో షాహిద్ కపూర్ పి ఆర్ టీమ్ అత్యుత్సాహం వల్ల ఇది అంతా జరిగి ఉంటుందనీ ఆపత్రిక తన కథనంలో అభిప్రాయ పడింది. అయితే ప్రభాస్ నేషనల్ సెలెబ్రెటీ స్థాయిలో ఉన్న నేపధ్యంలో ఇప్పుడు అతను తెలుగు అర్జున్ రెడ్డి మూవీని ఇంకా విడుదల కాని కబీర్ సింగ్ మూవీతో పోలుస్తూ చేసిన కామెంట్స్ ఇప్పుడు బాలీవుడ్ మీడియాకు హాట్ టాపిక్ గా మారాయి. 

అయితే ఈ కథనంలోని ప్రభాస్ చేసినట్లుగా వస్తున్న కామెంట్స్ విజయ్ దేవరకొండ అభిమానులకు తీవ్ర అసహనాన్ని కలిగిస్తున్నట్లు టాక్. అయితే ఈమధ్య విజయ్ దేవరకొండ ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ దర్శకుడు సందీప్ వంగ తెలుగు అర్జున్ రెడ్డి కన్నా హిందీ కబీర్ సింగ్ మూవీని చాల అద్భుతంగా తీస్తున్నాడు అని కామెంట్స్ చేసిన నేపధ్యంలో ప్రభాస్ ‘కబీర్ సింగ్’ మూవీ పై చేసిన కామెంట్స్ నిజమేనా అని అనిపించడం సహజం.



మరింత సమాచారం తెలుసుకోండి: