పవన్  కళ్యాణ్ సినిమాలకు దూరం అయిన తరువాత ఎప్పటికైనా పవన్ వారసుడుగా అకిరా నందన్  టాలీవుడ్ ఎంట్రీ ఇస్తాడు అన్న ఆశతో పవన్ అభిమానులు కాలం గడుపుతున్నారు. ఇలాంటి పరీస్థితులలొ అకిరా టీనేజ్ లోనే సోషల్ మీడియా స్టార్ గా మారిపోతున్నాడు. దీనికితోడు  రేణు దేశాయ్ తరుచుగా అకిరా ఫోటోలనను విశేషాలని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో  షేర్ చేస్తూ అకిరా క్రేజ్ ను మరింత పెంచడానికి తనవంతు కృషి చేస్తోంది.

ఇలాంటి పరిస్థితులలో అకీరా నందన్ పేస్ బుక్ ట్విట్టర్ లో ఖాతా ఓపెన్ చేశాడని జరిగిన ప్రచారం హాట్ టాపిక్ గా మారింది.  దీనికితోడు అకిరా పేరు మీద పోస్ట్ లు కూడా  వస్తున్న నేపధ్యంలో  ఆ అకౌంట్స్ కు ఫాలోయర్ల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది.  అంతేకాదు ఇక రానున్న రోజులలో  ఇకపై స్వయంగా అకీరానే సామజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో ముచ్చటించబోతున్నట్లు ప్రచారం జరిగింది. 

దీనితో ఈ న్యూస్ వైరల్ గా మారడంతో ఈవార్తల పై రేణు దేశాయ్ వివరణ ఇచ్చింది. అకీరా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు. పవన్ కళ్యాణ్ వారసత్వాన్ని అకీరా కొనసాగించాలని కోరుకుంటున్నారు. అకీరా సినిమాల్లో నటించడం కోసం అభిమానులు ఇప్పటి నుంచే ఎదురుచూస్తూ సోషల్ మీడియాలో తనకు కామెంట్స్ పెడుతున్నవిషయాలను తెలియచేసింది.  అంతేకాదు అకీరా పేరు మీద 2 లక్షల ఫాలోయర్స్ ఉన్న ఒక పేస్ బుక్ పేజీ వైరల్ అవుతున్న నేపధ్యంలో వాస్తవానికి అకీరా ఇంతవరకు ఎలాంటి సోషల్ మీడియా ఎకౌంటు ను  ఓపెన్ చేయలేదు అని రేణు దేశాయ్ తెలిపింది. 

అకీరా పేరు మీద ఓపెన్ చేసి ఉన్న ఖాతాలన్నీ పవన్ అభిమానులు క్రియేట్ చేసినవని రేణు దేశాయ్ క్లారిటీ  ఇచ్చింది.   ఈ మధ్య పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో అనారోగ్యానికి గురైనప్పుడు అకీరానే స్వయంగా పేస్ బుక్ ట్విట్టర్ లో కామెంట్ పెట్టాడని అభిమానులు భావించారని అది నిజంకాదని రేణు దేశాయ్ క్లారిటీ ఇచ్చింది. అయితే భవిష్యత్ లో అకిరా ఏరంగంలో సెటిల్ అవుతాడో తనకు క్లారిటీ లేదని అప్పటివరకు వేచి ఉండాలి అంటూ రేణు దేశాయ్ చేసిన విజ్ఞప్తి హాట్ టాపిక్ గామారింది..


మరింత సమాచారం తెలుసుకోండి: