ఆ మద్య బాలీవుడ్ లో మీ టూ ఉద్యమం భారీ ఎత్తున జరిగిన విషయం తెలిసిందే.  హాలీవుడ్ లో మొదలైన ఈ ఉద్యమం బాలీవుడ్ లో సైతం పెను సంచలనాలు సృష్టించింది.  తనూశ్రీ దత్త గతంలో తనపై నానా పటేకర్ లైంగిక వేధింపులకు పాల్పపడ్డాడని సంచలన వ్యాఖ్యలు చేసింది.  ఆ తర్వాత కంగనా రౌనత్ సైతం తనపై లైంగిక వేధింపులు జరిగాయని అన్నారు.  వీరి తర్వాత పలువురు నటీమణులు గతంలో తమపై లైంగిక వేధింపులు జరిగాయని మీడియా సాక్షిగా తమ ఆవేదన వ్యక్తం చేశారు.


ఇక టాలీవుడ్ లో నటి శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ పై పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకు వచ్చారు.  చిత్ర పరిశ్రమలో నటీగా గుర్తింపు పొందాలని వచ్చేవారు కొంత మంది దళారులు ఎన్నో దారుణాలకు పాల్పపడుతున్నారని ఆరోపించింది.  తనపై కూడా ఎంతో మంది ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పపడ్డారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.  అయితే శ్రీరెడ్డి ఉద్యమంలో అనుకోని పరిస్థితులు ఎదురు కావడంతో ఆమె పై విమర్శలు వెల్లువెత్తాయి. 


తాజాగా బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా తను కూడా లైంగిక వేధింపులకు గురైనట్లు చెప్పి షాకింగ్ కామెంట్స్ చేసింది. అప్పట్లో మీ టూ ఉద్యం బాలీవుడ్ లో కొనసాగుతున్నా సైలెంట్ గా ఉన్నా..తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. యాంకర్.. 'ఎప్పుడైనా లైంగిక వేధింపులను ఎదుర్కొన్నారా..?' అని ప్రశ్నించగా..  ''ఎస్.. నేను కూడా బాధితురాలినే'' అని చెప్పింది. తనను ఎవరు వేధించారు..? ఎప్పుడు వేధించారనే విషయాలపై మాట్లాడడానికి ప్రియాంక ఇష్టపడలేదు. ప్రస్తుతం ప్రియాంక తన భర్త నిక్ తో కలిసి అమెరికాలో నివసిస్తున్న విషయం తెలిసిందే. 



మరింత సమాచారం తెలుసుకోండి: