టాలీవుడ్ లో హిట్ కాంబినేషన్ అని చెప్పుకునే త్రివిక్రమ్ శ్రీనివాస్ - అల్లు అర్జున్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.  నా పేరు సూర్య సినిమా తర్వాత అల్లు అర్జున్ చాలా గ్యాప్ తీసుకొని మాటల మాంత్రికుడి దర్శకత్వంలో నటిస్తున్నాడు.  ఇటీవల ఈ సినిమా ముహూర్తం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది.  ఈ నెల 24 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. పూజా హెగ్డే కథానాయికగా న‌టిస్తున్నఈ మూవీ హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ సంయుక్తంగా ఈ సినిమా నిర్మిస్తున్నారు. 

ఎన్టీఆర్ తో అరవింద సమేత లాంటి హిట్ సినిమా తర్వాత త్రివిక్రమ్, అల్లు అర్జున్ తో సరికొత్త సెంటిమెంట్ సినిమా రూపొందించబోతున్నట్లు సమాచారం.  గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి లు వచ్చాయి.  అయితే సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో ఫాదర్ సెంటిమెంట్ ఉన్న విషయం తెలిసిందే.  తాజా స‌మాచారం ప్ర‌కారం బ‌న్నీ 19వ సినిమా త‌ల్లీ-కొడుకు అనుబంధం నేప‌థ్యంలో రూపొంద‌నుంద‌ని అంటున్నారు. అందుకే ఒకప్పటి అందాల తార టబు ని ఈ సినిమాలో మదర్ క్యారెక్టర్ కోసం తీసుకున్నారట.

ఇక సినిమాకి టైటిల్‌గా ‘అల‌క‌నంద’అనే టైటిల్ బాగుంటుంద‌ని యూనిట్ ఆలోచిస్తుంద‌ట‌.  ఈ మూవీ తల్లి క్యారెక్టర్ చుట్టూ తిరుగుతున్నందున ఈ టైటిల్ సరిగ్గా సరిపోతుందని చిత్ర యూనిట్ భావిస్తున్నారట. ఈ సినిమాకి  థ‌మ‌న్ సంగీతం అందించ‌నున్నారు. యువ హీరో సుశాంత్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో టబు, సత్యరాజ్, సునీల్, రాజేంద్రప్రసాద్, నవదీప్, బ్రహ్మాజీ, రావు రమేష్, మురళీశర్మ, రాహుల్ రామకృష్ణ తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: