ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి అదేవిధంగా రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులు పబ్లిక్ గా మాట్లాడే డప్పుడు సరిగా మాట్లడకుంటే వారి మాటలకు ఎదుటి వ్యక్తుల మనో భావాలు దెబ్బతింటూ ఉంటాయి. దీనితో సెలబ్రెటీలు ఎప్పుడైనా మాట్లాడే సమయంలో చాలా జాగ్రత్తగాఉంటారు.  

అయితే ఈ విషయాలు ఏమి  కన్నడ హీరోయిన్ ‘జెర్సీ’ తో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న శ్రద్ధ శ్రీనాథ్ కు తెలిసినట్లుగా లేదు. అందుకే రీసెంట్ గా ఒక విషయంలో క్యాజువల్ గా మాట్లాడి  సమంత అభిమానులు హార్ట్ చేసింది శ్రద్ద శ్రీనాథ్ సమంత తెలుగులో చేసిన 'యూ టర్న్' సినిమాకు కన్నడ ఒరిజినల్ లో హీరోయిన్ గా చేసిన శ్రద్ధ  శ్రీనాథ్ ఈమధ్య 'జెర్సీ' ప్రమోషన్స్ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సమంత నటించిన 'యూ టర్న్' చిత్రాన్ని అరగంట కంటే ఎక్కువసేపు చూడలేకపోయానని క్యాజువల్ గా  చెప్పింది.   

దీనికికారణం ఏంటంటే ఆమె చాలా పొసెసివ్ అయిన నేపధ్యంలో తను నటించిన పాత్రలో మరొకరిని ఊహించుకోలేకపోయానని ఓపెన్ గా చెప్పి అందరికి షాక్ ఇచ్చింది. ఈ విషయం జరిగి కొద్దిరోజులు అవ్వకుండానే ఈ కన్నడ బ్యూటీ మరోసారి మీడియా వార్తలకు చిరునామాగా మారింది. శ్రద్ధ ఏ ఉద్దేశంతో అలాఅందో తెలియపోయినా నిన్నజరిగిన ‘మజిలీ’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో మాట్లాడుతూ తన స్పీచ్ కి అడ్డుతగులుతున్న నాని అభిమానులకు షాక్ ఇచ్చింది. 

నిన్న జరిగిన ఈ ఫంక్షన్ లో ఆమె మాట్లాడుతూ ‘జెర్సీ’ లో తన పాత్ర గురించి వివరిస్తున్నప్పుడు ఆమె స్పీచ్ కి అనేకసార్లు నాని అభిమానులు విపరీతంగా అడ్డుతగిలారు. దీనితో అసహనానినికి లోనైన ఈమె ‘ఒకే జై నాని అన్నా’ అంటూ ఆమె కూడ నాని అభిమానులతో కలిసి స్లోగన్ ఇచ్చి మధ్యలో ఆమె స్పీచ్ ని కోపంతో ముగించి వేసింది. అనుకోని ఈ పరిణామానికి షాక్ అయిన నాని ఆమె దగ్గరకు వెళ్లి నచ్చచెప్పడానికి ప్రయత్నించాడు. ప్రస్తుత కాలం హీరోయిన్స్ కు కూడ యాటిట్యూడ్ బాగా పెరిగిపోయింది అంటూ ఆ ఫంక్షన్ కు వచ్చిన అతిథులు బాగా కామెంట్స్ చేసుకున్నట్లు టాక్..     


మరింత సమాచారం తెలుసుకోండి: