తెలుగు ఇండస్ట్రీలోకి ‘పిల్లా నువ్వు లేని జీవితం’ చిత్రంతో మంచి విజయం అందుకున్న మెగాస్టార్ చిరంజీవి మేనళ్లుడు సాయిధరమ్ తేజ్ ఆ తర్వాత సుబ్రమణ్య ఫర్ సేల్, సుప్రీమ్ చిత్రాలతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత మనోడికి బ్యాడ్ లక్ మొదలైందనే చెప్పాలి. ఆరు చిత్రాలు వరుసగా ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడమే కాదు అందులో కొన్ని భారీ డిజాస్టర్ కూడా అయ్యాయి. దాంతో సాయిధరమ్ కెరీర్ కంప్లీట్ అనుకున్న సమయంలో కిషోర్ తిరుమల దర్శకత్వంలో 'చిత్రలహరి' ఈ నెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
సందేశంతో కూడిన ఈ ప్రేమకథా చిత్రానికి అన్ని ప్రాంతాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రంలో సాయితేజ్ సరసన కల్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా నటించారు. రిలీజ్ అయిన అన్ని కేంద్రాల్లో మిశ్రమ స్పందన వచ్చినా..ఈ 4 రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది.
బయ్యర్ల పెట్టుబడిలో 80 శాతం వెనక్కి వచ్చేసింది. ఇప్పటి వరకు వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న సాయిధరమ్ తేజ్ కి ఇది బూస్టింగ్ ఇచ్చిన చిత్రమనే చెప్పాలి. అమెరికాలో వసూళ్లు పుంజుకుంటే, ఈ పాటికే లాభాల బాట పట్టేదనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.