సంవత్సర కాలం సినిమాలకు దూరంగా ఉంటూ రాజకీయ పోరాటం చేసిన పవన్ కళ్యాణ్ తన పోరాటాన్ని ముగించి తిరిగి సినిమాల వైపు యూటర్న్ తీసుకుంటున్నాడు అన్న స్పష్టమైన సంకేతాలు నిన్న వచ్చాయి. తెలుస్తున్న సమాచారం మేరకు పవన్ కళ్యాణ్ సాయి తేజ్ అతడి కుటుంబ సభ్యులతో కలిసి ‘చిత్రలహరి’ మూవీని చూసినట్లుగా వార్తలు వస్తున్నాయి.

పవన్ కోసం ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేకమైన షోకు పవన్ తో పాటు సాయి తేజ్ కుటుంబ సభ్యులు అంతా వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈసినిమాను చిరంజీవి చూసి తన మేనల్లుడు సినిమాను మెగా స్టార్ ప్రమోట్ చేస్తున్న నేపధ్యంలో చిరంజీవి ప్రయత్నాలకు పవన్ సహాయ సహకారాలు కూడ లభించినట్లు అయింది. 

ఈసినిమాను చూస్తున్నంత సేపు పవన్ తెగ నవ్వుకున్నాడనీ ఈ ఫెయిల్యూర్ స్టోరీ పవన్ కు బాగా నచ్చినట్లు సమాచారం. అంతేకాదు తన కెరియర్ కు ‘ఖుషీ’ ఎలాంటి బ్రేక్ ఇచ్చిందో అలాంటి బ్రేక్ తేజ్ కు ‘చిత్రలహరి’ ఇస్తుంది అని పవన్ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఈ స్పెషల్ షోను పవన్ తన భార్య అన్నాతో కలిసి చూసినట్లు తెలుస్తోంది. ఈమూవీ డైరెక్టర్ కిషోర్ తిరుమల పై పవన్ ప్రశంసలు కురిపించినట్లు వార్తలు వస్తున్నాయి. 

పవన్ ‘జనసేన’ కు కనీసం మూడు సీట్లు రావడం కూడ కష్టమే అని వార్తలు వస్తున్న నేపధ్యంలో షాక్ లో ఉన్న పవన్ కు సాయి తేజ్ నటించిన ఈ ఫెయిల్యూర్ స్టోరీ బాగా నచ్చింది అనుకోవాలి. ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత పవన్ నిర్మాతగా తన పవన్ కళ్యాణ్ ఆర్ట్స్ బ్యానర్ పై సినిమా తీయబోతున్నాడు అని వార్తలు వస్తున్న నేపధ్యంలో పవన్ సాయి తేజ్ నటించిన ‘చిత్రలహరి’ చూడటం బట్టీ త్వరలోనే పవన్ తన మేనల్లుడుతో ఒక సినిమాను తీసే ఆస్కారం స్పష్టంగా కనిపిస్తోంది అన్న మాటలు వినిపిస్తున్నాయి..    


మరింత సమాచారం తెలుసుకోండి: