ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ ఇంటిలో విషాద సంఘటన జరగడంతో విషాదంలో మునిగిపోయిన పూరీకి చాలామంది సంతాపం తెలియచేస్తున్నారు. దీనికి కారణం పూరీకి ఎంతో ఇష్టమైన పెంపుడు కుక్క జాక్స్ చనిపోయింది. పూరీకి జంతువులు అంటే విపరీతమైన ఇష్టం అన్న విషయం తెలిసిందే. 

తన పెంపుడు కుక్క జాక్స్ మరణించిందనీ పూరి ఎమోషనల్ గా ట్విట్ చేయడమే కాకుండా తన పెంపుడు కుక్క ఫోటోలను షేర్ చేస్తూ ఆ కుక్కకు సాంప్రదాయ పద్దతిలో అంత్యక్రియలు చేసినట్లు వెల్లడించాడు. ఈ విషాదంలో పూరి చేసిన ట్విట్ సంచలనంగా మారింది. ‘వీడి పేరు జాక్స్. ఎప్పుడూ నాతోనే ఉండేవాడు. ఒకానొక టైంలో వీడిని పెంచే పరిస్థితి లేక నా ఫ్రెండుకి ఇచ్చేశాను. 5 సంవత్సరాల తర్వాత మళ్లీ తీసుకొచ్చేశాను. కానీ వాడు హర్ట్ అయ్యి అప్పటి నుంచి నాతో మాట్లాడటం మానేశాడు' మళ్లీ తీసుకొచ్చాక నా దగ్గరకు వచ్చేవాడు కాదు, నా వైపు చూసేవాడు కాదు. తోక కూడా ఊపి ఇప్పటికీ 8 సంవత్సరాలైంది. నేను లైఫ్‌లో ఎంత మందిని బాధపెట్టానో నాకు తెలియదు కానీ వీడిని మాత్రం చాలా బాధ పెట్టాను’ అంటూ ఎమోషనల్ గా పూరి ట్విట్ చేసాడు.

ఇప్పుడు ఈ ట్విట్ వైరల్ గా మారడంతో చాలమంది పూరీకి సంతాపం తెలుపుతూ ట్విట్స్ పెడుతున్నారు. మరికొందరైతే ఈ విషయంలో పూరీ పై సెటైర్లు కూడ వేస్తున్నారు. జాక్స్ మీద బెంగతో పూరి ప్రస్తుతం తాను రామ్ తో తీస్తున్న ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా పై శ్రద్ద తగ్గించవద్దనీ పూరీ కెరియర్ కు కీలకంగా మారిన ఈమూవీ విషయాలు పట్టించుకాకపోతే ఇబ్బంది పడతావు అంటూ అభిమానులు పూరీని హెచ్చరిస్తున్నారు. 

ఇది ఇలా ఉండగా పూరీని ఓదారుస్తూ చార్మి నిధి అగర్వాల్ లాంటి కొందరు హీరోయిన్స్ పూరీ ఈ బాధ నుండి త్వరగా కోలుకోవాలి అంటూ భగవంతుడుని ప్రార్ధిస్తూ పెట్టిన ట్విట్స్ వైరల్ గా మారాయి. ఏది ఏమైనా పూరీ జంతు ప్రేమ అతడి అభిమానుల మధ్య హాట్ న్యూస్ గా మారింది..  


మరింత సమాచారం తెలుసుకోండి: