తెగుగు ఇండస్ట్రీలో రాంగోపాల్ వర్మ శిశ్యుడు బద్రి చిత్రంతో మాస్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయి.. ‘ఇడియట్ ’ చిత్రంతో డేరింగ్..డాషింగ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు పూరి జగన్నాథ్. ప్రస్తుతం రామ్ హీరోగా ‘ఇ స్మార్ట్ శంకర్’చిత్రం రూపొందిస్తున్నారు.  ఇండస్ట్రీలో ఎంత డాషింగ్ డైరెక్టర్ అయినా పురి మాత్రం ఇంట్లో చిన్న పిల్లాడిలా ఉంటారని టాక్. ఆయన జంతు ప్రేమికుడు..తన ఇంట్లో ఎన్నో రకాల జంతువులు, పక్షులను పెంచుకుంటున్న విషయం తెలిసిందే.  అప్పుడప్పుడు తన ఇంట్లో తన స్నేహితులంటూ కొన్ని జంతువులను పరిచయం చేస్తుంటారు. 


తాజాగా తానెంతో ప్రేమతో పెంచుకున్న శునకం జాక్స్ మృతి చెందిందని చెబుతూ, దానితో తనకున్న జ్ఞాపకాలను పంచుకుంటూ దర్శకుడు పూరీ జగన్నాథ్ భావోద్వేగ ట్వీట్ ను పోస్ట్ చేయగా నెటిజన్లు ఊరడిస్తున్నారు. అయితే జాక్స్ నా ప్రాణం కన్నా ఎక్కువ గా ప్రేమించానని..సినిమా కష్టాలు తనను చుట్టుముట్టిన వేళ, జాక్స్ ను తన స్నేహితుడి ఇంటికి పంపానని, ఐదేళ్ల తరువాత తాను తిరిగి తెచ్చుకున్నానని గుర్తు చేసుకున్నాడు.  ఆ సమయంలో జాక్స్ ని పెంచే పరిస్థితిలో తాను లేకపోవడంతో ఆ పని చేశానని..కానీ జాక్స్ మాత్రం తనను తప్పుగా అర్థం చేసుకుందని..గతలో తనతో ఉన్నంత ప్రేమగా లేదని కనీసం తన వద్దకు వచ్చి తోక కూడా ఉపలేదని..ఆవేదన చెందాడు. 


నా జీవితంలో ఎంత మందిని భాద పెట్టాలో తెలియదు కానీ.. జాక్స్ ను మాత్రం చాలా బాధపెట్టానని అన్నాడు. వాడింక లేడని, ఇదే చివరి రోజని అన్నాడు. తాజాగా పూరీ పెట్టిన ఈ పోస్ట్ చదివి తమ గుండెలు బరువెక్కుతున్నాయని, మీ బాధను అర్థం చేసుకోగలమని, జాక్స్ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నామని వ్యాఖ్యానిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: