టాలీవుడ్ బిగ్గెస్ట్ ప్రాజెక్టు RRR షూటింగ్ కు సంబంధించి ఎలాంటి అప్ డేట్స్ షేర్ కాకుండా జాగ్రత్త పడుతున్న డైరెక్టర్ రాజమౌళి లీక్స్ ని మాత్రం ఆపలేకపోతున్నాడు. అయితే అవి అభిమానులకు మాంచి హుషారు ఇచ్చేలా ఉండటంతో ఎప్పటికప్పుడు RRR అప్డేట్ మీద ఆసక్తి పెరిగిపోతోంది.
ప్రస్తుతం రామ్ చరణ్ కు గాయం కావడంతో షూటింగ్కు చిన్న బ్రేక్ ఇచ్చిన జక్కన్న అతి త్వరలోనే రీ-స్టార్ట్ చేయబోతున్నాడు. రేపో ఎల్లుండో డాక్టర్లు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత చరణ్ - తారక్ ఇద్దరూ కలిసి మళ్ళి బయలుదేరతారు.
తాజాగా వచ్చిన సమాచారం మేరకు రాజమౌళి నెక్స్ట్ తారక్కు సంబంధించిన ఇంట్రో ఎపిసోడ్ షూట్ చేయబోతున్నాడట. గతంలో ఫస్ట్ షెడ్యూల్లోనే చరణ్ కు సంబంధించిన ఇంట్రో పూర్తి చేశాడు జక్కన్న. ఇప్పుడు తారక్ వంతు వచ్చింది. ఇది అయ్యాక అజయ్ దేవగన్ స్పెషల్ ఎపిసోడ్ లో ఇంట్రో కూడా ఓ రేంజ్ లో ఉంటుందట. మొత్తం ఈ మూడు ఎపిసోడ్లకు కలిపి సుమారు 50 కోట్ల దాకా ఖర్చు పెట్టనున్నట్టు వినిపిస్తోంది.
కేవలం ఆరు నిమిషాలలోపే ఉండే ఇంట్రో సీన్స్ కే ఇంత ఖర్చు పెడుతున్నారు అంటే కీలకమైన యాక్షన్ ఎపిసోడ్స్ ని రాజమౌళి ఏ రేంజ్ లో తీయబోతున్నాడో ఊహించుకుంటేనే రోమాలు నిక్కబోడుచుకుంటాయ్. 400 కోట్ల దాకా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా కోసం లైఫ్ అఫ్ పై, జంగల్ బుక్ లాంటి సినిమాలు చేసిన టెక్నీషియన్స్ పని చేస్తున్నారు.
మాములు హీరోలనే ఓ రేంజ్ లో చూపించే నేను ఇక అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ లను ఎలా చూపిస్తానో ఊహించుకోండని చెప్పిన రాజమౌళి.. ఇంట్రో నుంచే ఆ రేంజ్ను కొనసాగుస్తున్నాడన్న మాట. మొత్తానికి తారక్-చెర్రీల కాంబో సీన్లు ఏ రేంజ్లో ఉండబోతున్నాయో అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్.