ఈ మద్య కొన్ని చిత్రాల ప్రమోషన్లు చాలా చిత్ర విచిత్రంగా చేస్తున్నారు.  ఓ సినిమా ముహూర్తం మొదలు కాగానే దానికి సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేస్తున్నారు.  అయితే ఆ పోస్టర్ లో సినిమా గురించి చెబుతున్నట్లే ఉంటుంది..కానీ ఏమీ అర్థం కాదు. అయితే ఈ పోస్టర్లు కొన్ని శృతి మించేలా డిజైన్ చేసి సోషల్ మీడియాలో వదులుతున్నారని ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు అదే విమర్శలు ఎదుర్కొంటున్నారు మెంట‌ల్ హై క్యా టీమ్. 

వివరాల్లోకి వెళితే.. అనుష్క ప్రధాన పాత్రలో  ఆ మధ్యన సైజ్ జీరో అనే ప్ర‌యోగాత్మ‌క చిత్రం డైరక్ట్ చేసిన  ప్ర‌కాశ్ కోవెల‌మూడి ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో రాజ్‌కుమార్ రావు, కంగ‌నా ప్ర‌ధాన పాత్ర‌ల‌లో మెంట‌ల్ హై క్యా అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే.  పోస్ట‌ర్‌లో కంగ‌నా ర‌నౌత్‌, రాజ్ కుమార్ రావులు నాలుక‌పై ప‌దునైన బ్లేడ్‌ని ఉంచుకోవటం జనాలని హడులెత్తిస్తోంది.

ఈ పోస్ట‌ర్‌ని చూసిన అభిమానుల ఒళ్ళు గ‌గుర్పాటుకి గుర‌య్యేలా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.   ఇలాంటి పోస్టర్లు యువత, పిల్లపై పడితే ఎంత ప్రమాదం ఉంటుందని..సున్నితమైన ప్రదేశాల్లో అలా బ్లేడు ఉంచి పోస్టర్ క్రియేట్ చేసి వెర్రితనంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.  పోస్టర్ ఇంత భయంకరంగా ఉంటే చిత్రం ఇంకెంత భయంకరంగా ఉంటుందో అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

మెంట‌ల్ హై క్యా చిత్రాన్ని జూన్ 21న  ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రావ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. రాజ్‌కుమార్ రావు, కంగ‌నా ర‌నౌత్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న రెండో చిత్రం మెంట‌ల్ హై క్యా కాగా, తొలి సారి వీరిద్ద‌రు 2013లో వ‌చ్చిన డ్రామా చిత్రం క్వీన్‌లో న‌టించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: