వరుసగా ఆరు ఫ్లాపులు పడ్డాక మెగా మేనళ్లుడు సాయి తేజ్ పరిస్థితి మరీ దారుణంగా మారింది. ఇక రీసెంట్ గా వచ్చిన చిత్రలహరి సినిమాతో గట్టేక్కేశాడు సాయి తేజ్. పేరు మార్చుకున్న వేళా విశేషం బాగుంది అనుకుంటా మనోడి ఖాతాలో ఓ హిట్టు సినిమా పడ్డది. కిశోర్ తిరుమల డైరక్షన్ లో వచ్చిన చిత్రలహరి సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు.


కళ్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ కూడా చాలా ప్లస్ అయ్యింది. ఈ సినిమా సక్సెస్ తో ఫుల్ ఎంజాయ్ చేస్తున్న సాయి తేజ్ రిలీజ్ తర్వాత కూడా బాగా ప్రమోట్ చేస్తున్నాడు. ఇక ఈ క్రమంలోనే సాయి తేజ్ తో అల్లు అర్జున్ గొడవ గురించి ఆరా తీశారు మీడియా వారు.


అల్లు అర్జున్ తో మీకు గొడవైందట నిజమేనా.. అసలు గొడవ ఎందుకైందని అడిగారు. అసలు బన్నితో తనకు గొడవ ఏంటని చిన్నప్పటి నుండి కలిసి మెలిసి ఉన్న తమ మధ్య గొడవలు ఎందుకు వస్తాయని అన్నాడు సాయి తేజ్. ఇక తన కెరియర్ ఎవరో నాశనం చేస్తున్నారని.. తనని ఎదగకుండా ఎవరో చేస్తున్నారని వచ్చిన వార్తలకు అదిరిపోయే సమాధానం ఇచ్చాడు.


తన సినిమాల ఎంపికలో తనదే ఫైనల్ డెశిషన్ తనని ఎవరు మిస్ గైడ్ చేయట్లేదని. అలాంటివి అసలు తమ ఫ్యామిలీలో లేవని అన్నారు సాయి తేజ్. ఇక రాం చరణ్, వరుణ్ తేజ్ లతో ఎక్కువగా క్లోజ్ గా ఉంటా బన్ని కూడా కలిసినప్పుడు సరదాగా ఉంటాం. మా మధ్య అసలు ఎలాంటి విభేధాలు లేవని క్లారిటీ ఇచ్చాడు సాయి తేజ్.  



మరింత సమాచారం తెలుసుకోండి: