సూపర్ స్టార్ మహేష్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా మహర్షి. పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. మే 9న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా నుండి ఇంటర్వల్ సీన్ లీక్ అవడం హాట్ టాపిక్ గా మారింది.


సినిమాలో మహేష్ రెండు డిఫరెంట్ రోల్స్ లో కనిపిస్తాడని తెలుస్తుంది. ఒక్కడే రెండు షేడ్స్ చేస్తాడట. అందులో ఒకటి స్టూడెంట్ కాగా మరోటి ఓ కమెప్నీ సి.ఈ.వోగా నటిస్తున్నాడట. అయితే సినిమాలో రైతు సమస్యలపై పోరాడే యువకుడిగా కూడా మహేష్ పాత్ర ఉంటుందట. మహేష్, నరేష్ స్నేహుతులుగా నటిస్తుండగా సినిమాలో ఇంటర్వల్ సీన్ నరేష్ చనిపోవడం జరుగుతుందట.


ఇక నరేష్ సాధించాలనుకున్న లక్ష్యాన్ని మహేష్ నెరవేరుస్తాడని అంటున్నారు. అయితే ఇది నిజమా కాదా అన్నది తెలియాల్సి ఉంది. మరో పక్క నరేష్ తన సన్నిహితులతో మహర్షి లో తన పాత్ర చనిపోదని చెప్పాడట. సో మహర్షి పై వస్తున్న వార్తల్లో ఏది నిజం ఏది అబద్ధం అన్నది తెలియాల్సి ఉంది.


దిల్ రాజు, అశ్వనిదత్, పివిపి కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదరగొడుతుంది. సినిమాలో మహేష్ స్టైలిష్ లుక్ ఘట్టమనేని ఫ్యాన్స్ కు హుశారు తెస్తుందని అంటున్నారు. భరత్ అనే నేను తర్వాత మహేష్ చేస్తున్న ఈ సినిమాపై తారాస్థాయిలో అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: