జబర్ద్స్త్ అంటే తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ఎంతో ఇష్టం. తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ప్రతి రోజు ఎన్నో ఒత్తిళ్ల మధ్య, ఎంత బిజీగా ఉన్నా జబర్ద్స్త్ షో చూసి రిలాక్స్ అయిపోతుంటారు. తమకు నచ్చే టీంమెట్స్ కోసం కావొచ్చు... రెష్మీ, అనసూన కోసం కావొచ్చు, జడ్జిల జడ్జిమెంట్ కోసం కావొచ్చు. ఓవర్ ఆల్గా జబర్ద్స్త్ షో వచ్చిందంటే బుల్లితెర టీఆర్పీ రేటింగులు ఎలా పేలుతాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏదేమైనా బుల్లితెర మీద జబర్ద్స్త్ ఓ రేంజులో హిట్ అయిన ప్రోగ్రామ్. తాజాగా జబర్దస్త్ షోలో చేసిన కొన్ని మార్పులే ప్రేక్షకులకు అంత కిక్ ఇస్తున్నట్టు అనిపించడం లేదు. ఈ షోకు జడ్జ్లుగా ఉన్న నాగబాబు, రోజా ఏపీ ఎన్నికల్లో పోటీ చేశారు.
రోజా మరో సారి నగరి నుంచి వైసీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చెయ్యగా, నాగబాబు తన సోదరుడు పవన్ కళ్యాణ్ జనసేన నుంచి నరసాపురం ఎంపీగా పోటీ చేశారు. వీరిద్దరూ రాజకీయాల్లో బిజీ అవ్వడంతో వీరి ప్లేసుల్లో రోజా స్థానంలో మరో సీనియర్ హీరోయిన్ మీనా రాగా, నాగబాబు ప్లేస్లో ముందుగా శేఖర్ మాస్టార్... ఆ తర్వాత జానీ మాస్టార్ వచ్చి చేరారు. శేఖర్ మాస్టార్ సినిమాలతో బిజీగా ఉండడంతో ఆ తర్వాత జానీ మాస్టర్ ఎంట్రీ ఇచ్చారు. జానీ మాస్టార్ ఓ జడ్జ్గా ఉండి చేస్తున్న హడావుడితో అందరూ షాక్ అవుతున్నారు.
జానీ మాస్టార్ ఆ కంటెస్టెంట్స్ చేస్తున్న పెర్ఫామెన్స్కి కుర్చీలో నుంచి లేచి పడి పడి నవ్వడంతో పాటు గెంతులు వేస్తున్నారు. జానీ మాస్టార్ చేష్టలకు షాక్ అయిన మీనా జడ్జ్లనే వాళ్లు చాలా హుందాగా ఉండాలని కానీ... జానీ మాస్టార్ ఏంటి ఇలా చేస్తున్నాడంటూ షాక్కు గురి అవ్వడంతో పాటు ఆ ఫొటో సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. మీనా ఈ ఫొటో సోషల్ మీడియా ద్వారా షేర్ చెయ్యడంతో పాటు జానీ మాస్టార్ ప్రవర్తనను ప్రశ్నించినట్లు అయ్యింది. దీంతో అందరూ షాక్కు గురవుతున్నారు. మరి ఫైనల్గా జానీ మాస్టార్ ఈ షోకి జడ్జ్గా కంటిన్యూ అవుతారా ? లేదా మార్పులు ఏమైనా ఉంటాయా ? అన్న దానిపై ప్రస్తుతానికి గుసగుసలు నడుస్తున్నాయి.