తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు ఫ్యామిలీ హీరో, రొమాంటిక్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు జగపతి బాబు,  బోయపాటి శ్రీనివాస్, బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన ‘లెజెండ్’ చిత్రంతో విలన్ గా మారారు. అప్పట్లో కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగా..ఇండస్ట్రీకి దూరమయ్యే సమయంలో లెజెండ్ రూపంలో జగపతిబాబు జాతకం మొత్తం మారిపోయింది.  ఈ చిత్రంలో హీరో స్థాయిలో విలన్ కి కూడా మంచి పేరు వచ్చింది. 

అప్పటి నుంచి జగపతి బాబు విలన్ గా యూటర్న్ తీసుకున్నారు.  ఇప్పటి వరకు ఎన్నో చిత్రాల్లో విలన్ గా నటిస్తూ వస్తున్నాడు. తెలుగులోనే కాదు తమిళ, మళియాళ, హిందీ భాషల్లో కూడా విలన్ గా నటిస్తూ మెప్పిస్తున్నారు.  మహేశ్ బాబు తాజా చిత్రంగా 'మహర్షి' రూపొందుతోంది. రీసెంట్ గా షూటింగును పూర్తి చేసుకున్న ఈ సినిమా, మే 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.  ప్రస్తుతం  అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేశ్ బాబు నటించనున్నాడు. ఆ ప్రాజెక్టుకి సంబంధించిన సన్నాహాలు చకచకా జరిగిపోతున్నాయి.


 ఈ చిత్రంలతో మహేష్ బాబుకి ప్రతినాయకుడిగా జగపతి బాబు ఓ పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నాడట.  ఈ పాత్రకోసం జగపతిబాబు అయితే బాగుంటాడని భావించి ఆయనని సంప్రదించడం .. ఆయన అంగీకరించడం జరిగిపోయాయని అంటున్నారు.  గతంలో శ్రీమంతుడు చిత్రంలో మహేష్ బాబుకి తండ్రిగా జగపతిబాబు నటించాడు.  ఇప్పుడు విలన్ గా నటించబోతున్నాడు. ఇక అనిల్ రావిపూడి రూపొందించే ఈ సినిమాలో బండ్ల గణేశ్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నాడనే టాక్ కూడా బలంగానే వినిపిస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: