టాలీవుడ్ లో ఒకప్పుడు గ్లామర్ పాత్రల్లోనే కాదు తన నటనతో ఎంతో మంది హృదయాలు దోచుకున్న నటి విజయశాంతి. సీనియర్ నటులతో నటించిన విజయశాంతి తరువాతి కాలంలో ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ పాత్రల్లో కనిపించింది. టాలీవుడ్ లో లేడీ అమితాబచ్చన్ గా పేరు తెచ్చుకున్న విజయశాంతి నటించిన సినిమాలకు ఆదరణ తగ్గిపోవడంతో రాజకీయాల వైపు అడుగేసింది. గతంలో తెలంగాణ పోరాట సమయంలో కేసీఆర్ కి మద్దతు పలికి ఎంపి పదవిలో కొనసాగారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ తో విభేదించి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు..ప్రస్తుతం కాంగ్రెస్ ప్రచార కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఆ మద్య విజయశాంతి తెరపై కనిపించబోతుందని వార్తలు వచ్చాయి. కానీ తాను ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నానని..సినిమాల్లోకి రావడం లేదని అన్నారు. ఇటీవల మహేష్ బాబు, అనీల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో విజయశాంతి కనిపించబోతుందని వార్తలు వచ్చాయి..ఈ వార్తలు కూడా కొట్టి పడేసింది విజయ శాంతి.
అయితే విజయశాంతి హీరోయిన్ గా నటించే సమయంలో ఆమె సహనటీమణులు రమ్యకృష్ణ, నదియా,ఖుష్బూ,టబు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. తాజాగా వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా, సాయి పల్లవి ఓ సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం విజయశాంతిని సంప్రదించగా ఆమె సున్నితంగా తిరస్కరించారట. కాగా, ఇటీవల మహేష్ బాబు మూవీలో ఒక కీలకమైన పాత్ర కోసం విజయశాంతిని అనిల్ రావిపూడి సంప్రదించినట్టుగా తెలుస్తోంది.
పాత్ర ప్రాధాన్యత .. కాంబినేషన్ సీన్స్ గురించి వివరించడంతో ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్పుకుంటున్నారు. గతంలో మహేష్ బాబు బాలనటుడిగా ఉన్నపుడు విజయశాంతి తల్లి పాత్రలో నటించిన విషయం తెలిసిందే. మరి ఆమె ఈ సినిమా చేయడానికి అంగీకరించారనడంలో వాస్తవమెంతన్నది చూడాలి మరి.