ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ అంటే వారి ఆలోచన ఎప్పుడు నటన మీదనే ఉండేది.  ముఖ్యంగా చాలా మంది తారలు రంగస్థలం నుంచి వచ్చిన కారణంగా వారు ఎప్పుడు క్యారెక్టర్ ఏంటి, దానికి మనం ఏ స్థాయిలో పెర్ఫార్మెన్స్ చేయాలి. డైరెక్టర్ కి ఏం కావాలి అనే విషయాల గురించి ఎక్కువగా ఆలోచించే వారు. తాము సినిమాలో చేసేందుకు ఎంత రెమ్యునరేషన్ ఇస్తున్నారు. తన కష్టానికి సరిపడా వస్తుందా లేదా అనే విషయాలని కనీసం పట్టించుకునే వారు కాదు. ముఖ్యంగా హీరోయిన్స్ సంపాదన బాద్యత అంతా తల్లిదండ్రులు లేదంటే ఇతర కుటుంబ సభ్యులు చూసుకునే వారు.

 

దీంతో అప్పట్లో సక్సెస్ అయిన హీరోయిన్స్ రెమ్యునరేషన్ ఒక్కో సినిమాకి భారీగా తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా సావిత్రి, అంజలీదేవి, వాణిశ్రీ లాంటి తారలు హీరోలతో సమానంగా సినిమాలకి రెమ్యునరేషన్ తీసుకునే వారు అయితే అంత రెమ్యునరేషన్ వస్తున్న భవిష్యత్తు అవసరాల కోసం వెనకేసుకోవాలి అనే ఆలోచన వారికి అస్సలు ఉండేది కాదు. ఈ కారణంగానే చాలా మంది సినీ తారలు కెరియర్ ముగిసిన తర్వాత చివరి దశలో దారుణమైన ఆర్ధిక కష్టాలు అనుభవించారు. ఒకప్పుడు రమాప్రభ ఎంత పెద్ద నటి అనేది అందరికి తెలిసిందే. కాని ఇప్పుడు ఆర్ధికంగా చితికిపోయి బంధువుల ఇంట్లో తలదాచుకుంటుంది.


అయితే ఈ జెనరేషన్ హీరోయిన్స్ కి సంపాదన గురించి ఎవరు చెప్పాల్సిన పని లేదు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే సామెత  భాగా ఒంటబట్టించుకున్నారు. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఒక సక్సెస్ తో క్రేజీ రాగానే రెమ్యునరేషన్ అమాంతం పెంచేస్తున్నారు. ఇక డిమాండ్ ఎక్కువైన  కొద్ది పేమెంట్ కూడా భారీగానే డిమాండ్ చేస్తున్నారు. దాంతో పాటు అసిస్టెంట్ జీతాలు, మేకప్,  ట్రావెలింగ్, స్టే అంటూ మొత్తం ఖర్చు నిర్మతమీదనే వేసేస్తున్నారు. నిర్మాతలు కూడా క్రేజీ హీరోయిన్స్ కి భారీగా డబ్బులు ఇచ్చేందుకు రెడీ అయిపోతున్నారు.   మరో వైపు బయట కూడా షాపింగ్ మాల్స్, యాడ్స్ ద్వారా రెండు చేతులా సంపాదిస్తున్నారు.   ఇలా సంపాదించే భామలో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ముందు వరుసలో ఉంటుంది.


కొద్ది రోజుల క్రితం కాజల్ అగర్వాల్ శ్రీలంకలో ఓ క్యాసినోలో సందడి చేసింది. ఆ ఫోటోలు  సోషల్ మీడియాలో  వైరల్ గా మారాయి. ఆమె ప్రస్తుతం రవితేజ హీరోగా తెరకెక్కే తెరి రీమేక్ లో నటించాల్సి ఉంది. కానీ ఆ సినిమా అనుకోకుండా క్యాన్సిల్ కావడంతో దొరికిన ఫ్రీ టైమ్ ని కాజల్ సంపాదన కోసం వాడుకుంది.  ఏప్రిల్ 13 న శ్రీలంకకు వెకేషన్ కోసం వెళ్ళి. భామ సడెన్ గా అక్కడ బాలీస్ క్యాసినోలో ప్రత్యక్షం అయ్యింది. కస్టమర్లతో కలిసి సందడి చేసి, కబుర్లు చెప్పింది.  తమ కస్టమర్లతో గడిపినందుకు నిర్వాహకులు కాజల్ కి భారీగానే ముట్టజెప్పారు. మొత్తానికి వెకేషన్ కోసం వెళ్లి ఖర్చులకి డబ్బులు సంపాదించుకోవడం కాజల్ మరోసారి తన టాలెంట్ చూపించింది అని చెప్పాలి.  ఇలా కాజల్ లగే ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ అయిన తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్, రష్మిక మందన, పాయల్ రాజ్ పుత్ లాంటి భామలు తమ క్రేజీని కాష్ చేసుకొని సైడ్ బిజినెస్ చేస్తూ  భవిష్యత్తు గురించి ఇప్పుడే ఆలోచించేస్తున్నారు


మరింత సమాచారం తెలుసుకోండి: