శంకర్ ..రోబో 2.0 తరువాత తీసే సినిమా భారతీయుడు అయితే ఇప్పుడు ఆ సినిమా ఆగిపోయిందని పుకార్లు వస్తున్నాయి. అయితే తెలుగులో మన మెగా స్టార్ చిరంజీవి సైరా తర్వాత కొరటాల శివతో ఒక సినిమా ప్లాన్ చేసిన చరణ్ లైన్లో త్రివిక్రమ్ సినిమా కూడా పెట్టి వుంచాడు. కొణిదెల ప్రొడక్షన్స్లోనే వరుసగా చేస్తోన్న చిరంజీవి త్వరలో అల్లు అరవింద్ బ్యానర్లోను సినిమా చేయనున్నారు.
చరణ్ ఎలాగైతే చిరంజీవికి ప్రెస్టీజియస్ ప్రాజెక్టులు సెట్ చేస్తున్నాడో, అలాగే గీతా ఆర్ట్స్లో ఆయన చేసే చిత్రం అలాగే వుండాలని అల్లు అరవింద్ భావిస్తున్నారు. తమిళ దర్శకుడు శంకర్తో సినిమా చేయాలనే చిరంజీవికి చాలా కాలంగా మిగిలిపోయిన కల. పలుమార్లు తన కోరికని పబ్లిగ్గానే వెలిబుచ్చినా కానీ శంకర్ ఎందుకో చిరంజీవితో చేయడానికి ఆసక్తి చూపించలేదు. అయితే ప్రస్తుతం భారతీయుడు 2 ఆగిపోయి, తదుపరి చిత్రం ఏమిటనేది తెలియక వేచి చూస్తోన్న శంకర్తో స్ట్రెయిట్ తెలుగు సినిమా చేయించడానికి ఇదే మంచి టైమ్ అని అల్లు అరవింద్ అనుకుంటున్నారు.
శంకర్తో ఆయన ఆల్రెడీ టచ్లోకి కూడా వెళ్లారని సమాచారం. అయితే శంకర్ ఈమధ్య వందల కోట్ల బడ్జెట్ లేకుండా సినిమా చేయలేనని అంటున్నాడు. చిరంజీవితో శంకర్ సినిమా అంటే భారీ బడ్జెట్ పెట్టవచ్చు కానీ మరీ 2.0 రేంజ్ అంటే మాత్రం రిస్క్ అవుతుంది. మరి ఈ కాంబినేషన్ వర్కవుట్ చేయడానికి అల్లు అరవింద్ తన చాణక్యం ఎలా ప్రదర్శిస్తారనేది చూడాలి.