మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల ఎవరి టాలెంట్ వారు ప్రూవ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు.  చిరంజీవి తర్వాత మాస్ ఇమేజ్ తో పవర్ స్టార్ పవన్ కళ్యాన్ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారి మనసు దోచుకున్నారు.  ఆ తర్వాత అల్లు అర్జున్, రాంచరణ్ లు సైతం మంచి మాస్ ఫాలోయింగ్ సంపాదించారు.  వీరి తర్వాత పిల్లా నువ్వు లేని జీవితం సినిమాతో సాయిధరమో తేజ్,  ముకుందా సినిమాతో వరుణ్ తేజ్ లు హీరోలుగా వెండి తెరకు పరిచయం అయ్యారు.  అయితే సిని నేపథ్యంలో మెగా హీరోలు ఎవరూ ఎవరికి పోటీ లేకుండా తమ కెరీర్ కొనసాగిస్తున్నారు.

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి అలాగే మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కి మాటల్లేవ్ అని గత కొంత కాలంగా రూమర్స్ వస్తోన్న సంగతి తెలిసిందే.  అయితే ఈ వార్తలపై ఇద్దరు హీరోలు ఎలాంటి స్పందన తెల్పకపోవడంతో ఈ రూమర్లు నిజమే అని అనుకుంటున్నారు. గతంలో సరైనోడు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పను బ్రదర్ అంటూ బన్నీ పవన్ ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఆ తరువాత మరో ఈవెంట్ లో పవన్ ఫ్యాన్స్ అరుపులకు చెప్తాను బ్రదర్ అంటూ సాయి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశాడు.  ఈ విషయంలో బన్నికి స్వయంగా చిరంజీవి క్లాస్ తీసుకున్నట్లు గుస గుస.

  తాజాగా బన్నితో మాటల్లేవు అన్న వివాదంపై సాయిధరమ్ తేజ్ స్పందించి..ఇప్పటివరకు ఎలాంటి గొడవలు జరగలేదని అన్నాడు. బన్నీతన ఫ్యామిలీ మెంబర్ అంటూ.. అతనితో నేను ఫ్రెండ్లి గా ఉంటానని ఆన్సర్ ఇచ్చాడు. అయితే తాను ఎక్కువగా  చరణ్ - వరుణ్ లతోనే ఉంటానని అన్నారు.  మెగా ఫ్యామిలిలో ఎవరికీ ఎలాంటి గొడవలు లేవని అభిమానులు మధ్య కూడా ఎలాంటి విబేధాలని ఉండవని తేజు వివరణ ఇచ్చాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: