యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం సాహో. సుజిత్ దర్శకత్వంలో విజువల్ వండర్ గా యాక్షన్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి హాలీవుడ్ టెక్నిషియన్స్ పని చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో ఇప్పటి వరకు రానటువంటి హై స్టాండర్డ్స్ యాక్షన్ ఎలిమెంట్స్ ఇందులో ఉండనున్నాయి అనే విషయం సాహో మేకింగ్ వీడియోల ద్వారా స్పష్టం అయిపొయింది. ఇక ఈ సినిమాతో ప్రభాస్ తన మార్కెట్ లో యూనివర్శల్ చేసుకోవాలనే గట్టి ప్రయత్నంలో ఉన్నాడు.


 
భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ హాలీవుడ్ సినిమాల తరహాలో ఉంటాయని ఇప్పటికే దర్శకుడు స్పష్టం చేస్సాడు. ఇదిలా ఉంటే  ప్రస్తుతం ఈ సినిమాలోని కీలక సన్నివేశాలను ముంబైలోని చిత్రీకరిస్తున్నారు. ముఖ్యంగా యాక్షన్‌ ఎలిమెంట్స్ తో తెరకెక్కిస్తున్నట్లు తాజాగా బయటకి లీక్ అయిన ఫోటోల బట్టి తెలుస్తుంది. మరో వైపు టాకీ పార్ట్ కూడా పూర్తి చేసేసారు. దీంతో ఈ సినిమాకి  ఇదే లాస్ట్ షెడ్యూల్ అని తెలుస్తుంది.  ఇదిలా ఉంటే  ఈ సినిమాపై దర్శకుడు సుజిత్ ట్వీట్ పెట్టిన కామెంట్ ఇప్పుడు వైరల్ గా మారింది.  


ఎక్కడ మొదలైందో అక్కడే ముగుస్తుంది. ముంబైలో ‘సాహో’ షూటింగ్‌ అని దర్శకుడు సుజిత్‌ పెట్టిన  ట్వీట్ తో సినిమాకి గుమ్మడికాయ కొట్టేస్తున్నారు అని పరోక్షంగా  స్పష్టం చేసేసాడు. ప్రభాస్ తో పాటు హీరోయిన్ శ్రద్ధా కపూర్ కూడా ప్రస్తుతం ముంబైలో జరుగుతున్న షూటింగ్ లో భాగం అయినట్లు తెలుస్తుంది.  ఇక ఇందులో ప్రతినాయకుడుగా నీల్ నితిన్ ముఖేష్ నటిస్తున్న సంగతి తెలిసిందే.
 
ఇదిలా ఉంటే సాహో సినిమా పూర్తి కాగానే ప్రభాస్ నేరుగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జాన్ సినిమా షూటింగ్ లో పాల్గొంటాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన పీరియాడికల్ రిట్రో స్టైల్ పారిస్ సెట్ ని అన్నపూర్ణ స్టూడియోలో నిర్మిస్తున్నారు. ఈ సెట్ నిర్మాణం కూడా చివరి దశకి వచ్చేసింది. దీంతో త్వరలో దర్శకుడు రాధాకృష్ణ పారిస్ బ్యాక్ డ్రాప్ సన్నివేశాలు ఇందులో షూట్ చేస్తాడని తెలుస్తుంది. ఇది కూడా లవ్ యాక్షన్ స్టొరీతో తెరకెక్కుతున్నట్లు ప్రభాస్ కొద్ది రోజుల క్రితం నేషనల్ మీడియాతో చెప్పడంతో ఇప్పుడు ఈ సినిమా మీద కూడా మంచి బజ్ ఏర్పడింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: