టాలీవుడ్ కింగ్ నాగార్జున కథానాయకుడిగా 2002లో కె.విజయభాస్కర్ దర్శకత్వంలో వచ్చిన మన్మధుడు సినిమా నాగార్జున కెరీర్ను మలుపు తిప్పింది. అప్పటివరకు నాగార్జున ఉన్న క్లాస్ ఇమేజ్ను మన్మధుడు మరింతగా పెంచింది. సోనాలి బింద్రే, అన్షు హీరోయిన్లుగా వచ్చిన ఈ సినిమాలో నాగ్ నటన తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోరు. అప్పటి వరకు వరుస ఫ్లాపులతో కెరీర్ పరంగా తీవ్ర ఒడిదుడుకులు ఉన్న నాగ్లో మన్మధుడు తిరుగులేని జోష్ నింపింది. మన్మథుడు వచ్చిన 18 సంవత్సరాల తర్వాత ఇప్పుడు నాగ్ మన్మధుడు 2 సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. ఈ సినిమా కోసం పోర్చుగల్ లో రాహుల్ కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. సెట్స్లో అడవి ప్రాంతంలో నాగార్జున చేస్తున్న కసరత్తుల స్టిల్స్ బయటకు రావడంతో మళ్లీ నాగ్ మన్మధుడు 2 సినిమాతో అలరించడం ఖాయం అని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇండస్ట్రీలో వినపడుతున్న లీకుల ప్రకారం మన్మధుడు 2 కథను పరిశీలిస్తే మన్మథుడు సినిమాకు కొనసాగింపుగా ఉంటుందా ? అన్న దాని ప్రకారం చూస్తే కొంత వరకు మాత్రమే కంటిన్యుటి ఉంటుందని... మిగిలిన స్టోరీ ఇప్పటి స్టైల్లో తెరకెక్కుతుందని తెలుస్తోంది.
ఈ సినిమాలో సిస్టర్ సెంటిమెంట్ అన్నది కొత్త ఎలిమెంట్. సిస్టర్ సెంటిమెంట్ తోనే సినిమా మొత్తం తిరుగుతుందట. ఇంకా చెప్పాలంటే గతంలో ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన హిట్లర్ సినిమా స్టైల్ లో మన్మధుడు 2 ఉంటుందని సమాచారం. హీరో నాగార్జునకు ఐదుగురు సిస్టర్స్ ఉంటారట... వీరంతా అన్నకు ప్రియమైన చెళ్లెళ్లే. ఈ చెల్లెళ్లకు పెళ్ళిళ్ళు చేసే క్రమంలో ఈ మన్మథుడికి వయసు అయిపోతుందట. వయసు అయిపోయిన మనోడికి పిల్లను వెతికే క్రమంలో స్టోరీ చాలా ఫన్నీగా సాగుతుందని తెలుస్తోంది. ఇదే స్టోరీ లైన్ అయితే ప్రేక్షకులకు కావాల్సినంత వినోదం పంచడంతో పాటు మరో హిట్ నాగ్ తన ఖాతాలో వేసుకున్నట్టే. ఒక సిస్టర్ సెంటిమెంట్ కథలో మామ- కోడళ్లు (నాగ్ - సామ్) ఎలా కనిపించబోతున్నారో అంటూ అక్కినేని అభిమానుల్లోనూ ఆసక్తి నెలకొంది.