నందమూరి హీరోలు అయిన యువరత్న నందమూరి బాలకృష్ణ, యంగ్టైగర్ ఎన్టీఆర్ మధ్య గత కొన్నేళ్లుగా ఉప్పునిప్పుగా వాతావరణం నడుస్తోంది. ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ మరణం తర్వాత వీరిద్దరు దగ్గరైనట్టు కనిపించినా లోపల మాత్రం అంత సఖ్యత లేదన్నది ఓపెన్ సీక్రెట్. ఇక ఏపీలో తాజాగా జరిగిన ఎన్నికల ప్రచారంలో హరికృష్ణ ఫ్యామిలీ ఎక్కడా కనపడలేదు. అటు బాలయ్యతో పాటు ఆయన అల్లుళ్లు ఇద్దరూ ఈ ఎన్నికల్లో పోటీ చేశారు. నారా ఫ్యామిలీతో పాటు నందమూరి వసుంధరతో పాటు ఎన్టీఆర్ కుమార్తెలు సైతం ప్రచారం చేశారు. ఇక ఎన్టీఆర్కు మాత్రం ప్రచారంలోకి రావడం ఎంత మాత్రం ఇష్టంలేదు. అంతెందుకు నాలుగు నెలల క్రితం జరిగిన తెలంగాణ ఎన్నికల్లో సోదరి సుహాసిని పోటీ చేసినా అటు ఎన్టీఆర్ కాని.. ఇటు కళ్యాణ్రామ్ కాని అటు వైపే చూడలేదు.
ఇదిలా ఉంటే వీరిద్దరి మధ్య గ్యాప్కు నాని నటించిన జెర్సీ సినిమా ఓ కారణమంటూ కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. గౌతమ్ దర్శకత్వంలో నాని-శ్రద్ధ శ్రీనాథ్ జంటగా నటించిన చిత్రం జెర్సీ సూపర్ హిట్ టాక్తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఈ సినిమాకు ప్రేక్షకులు, రివ్యూవర్లతో పాటు ఇండస్ట్రీ వర్గాల నుంచి కూడా ప్రశంసలు వస్తున్నాయి. ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా నాని నటనను మెచ్చుకున్నారు. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్..ఆర్..ఆర్ షూటింగ్లో బిజీగా ఉన్నా కూడా నాని జెర్సీ సినిమా చూసి నాని నటన మెచ్చుకున్నాడు.
ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేసిన తన తాత బయోపిక్లు అయిన కథానాయకుడు, మహానాయకుడు సినిమాలను మాత్రం ఎన్టీఆర్ చూడలేదు. దీనిని బట్టే ఎన్టీఆర్ , బాలయ్య మధ్య ఉన్న గ్యాప్ ఏ మాత్రం తొలగిపోలేదని.... హరికృష్ణ మరణం తర్వాత బాలయ్య ఎన్టీఆర్ను దగ్గరకు తీసుకునేందుకు చేసిన ప్రయత్నాలు వీరి అవసరానికి, ఇటు ప్రపంచం కోసమేనా ? అన్న సందేహాలు అటు ఇండస్ట్రీ వర్గాలతో పాటు ఇటు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇక జెర్సీ మొదటి రోజు వరల్డ్వైడ్గా సుమారు రూ.7కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ.5కోట్ల షేర్ సాధించడం గమనార్హం.