ఎన్నికల తరువాత మౌన ముద్రలోకి వెళ్ళిపోయిన పవన్ కళ్యాణ్ 10 రోజులతరువాత ఈనాడు మీడియా సంస్థల అధినేత రామోజీరావు మనవరాలి పెళ్ళిలో కనిపించడం హాట్ న్యూస్ గా మారింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో పవన్ చంద్రబాబుల మధ్య రహస్య ఒప్పందం జరిగింది అంటూ వార్తలు వచ్చిన తరువాత వీరిద్దరు కలుసుకునే అవకాసం ఈ పెళ్ళి ద్వారా కలిగింది.

ఈ సందర్భంలో ఒకరికొకరు ఎదురుపడి కేవలం నమస్కారాలు ప్రతి నమస్కారాలు చేసుకోవడమే కాకుండా అత్యంత ఆప్యాయంగా పలకరించుకుంటూ ఒకరికొకరు చేతులు కలిపిన ఈ దృశ్యం ఆ ఫంక్షన్ కు వచ్చిన అందర్నీ విపరీతంగా ఆకర్షించింది. వీరిద్దరూ మాట్లాడుకున్నది కొన్ని నిముషాలు మాత్రమే అయినా ఏకాంతంగా వీరిద్దరూ ఏమి మాట్లాడుకున్నారు అన్న కోణంలో చర్చలు జరుగుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పవన్ చంద్రబాబును తక్కువగా విమర్శలు చేస్తే పవన్ పోటీ చేసిన గాజువాక వైపు చంద్రబాబు వెళ్లకపోవడం లోకేష్ పోటీచేసిన మంగళగిరి వైపు పవన్ వేల్లకపోవడంతో వీరిద్దరి మధ్య ఎదో తెలియని రహస్య ఒప్పందం జరిగింది అంటూ కామెంట్స్ ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థుతుల మధ్య జరిగిన పవన్ చంద్రబాబుల కలయికకు సంబంధించిన సంఘటన దేనికి సంకేతం అంటూ అంచనాలు మొదలైపోయాయి. 

రామోజీరావు మనవరాలు కీర్తి పెళ్ళికి రాజకీయ పారిశ్రామిక ప్రముఖులతో పాటు సినీ ప్రముఖులు అనేకమంది మంది వచ్చారు. చిరంజీవి కృష్ణంరాజు కృష్ణ అల్లు అరవింద్ రాజేంద్రప్రసాద్ బోయపాటి శ్రీను ఎస్వీ కృష్ణారెడ్డి లతో పాటు అనేకమంది సినీ ప్రముఖులు ఈ పెళ్ళికి రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో ‘జనసేన’ ఎన్ని స్థానాలు గెలుస్తుందో క్లారిటీ లేకపోయినా పవన్ జనసేన అతి త్వరలో జరగబోతున్న తెలంగాణ పంచాయితీ ఎన్నికలలో పోటీ చేయబోతున్నట్లు లీకులు రావడం అత్యంత ఆశ్చర్యంగా మారింది..   


మరింత సమాచారం తెలుసుకోండి: