బాహుబలి' తరువాత ప్రభాస్ మొదలుపెట్టిన 'సాహో'  షూటింగ్ ఎట్టకేలకు క్లైమాక్స్ కు  చేరుకున్ననట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ ఒత్తిడితో ఎలెర్ట్ అయిన ఈ మూవీ దర్శకుడు సుజిత్ ఎట్టకేలకు ఈ సినిమా షూటింగ్ ను త్వరలోనే పూర్తి చేయబోతున్నాడు. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మూవీ ఫైనల్ షెడ్యూల్ లోకి ఎంటరైంది అని వార్తలు వస్తున్నాయి.  

ఈ మూవీకి సంబంధించిన ఒక కీలక షెడ్యూల్ ముంబాయిలో ప్రారంభం అయినట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ తరువాత కేవలం ప్యాచ్ వర్క్ మాత్రమే మిగిలి ఉంటుంది అని అంటున్నారు. మరోవైపు రామోజీ ఫిలింసిటీలో  ఈ సినిమా కోసం వేసిన సెట్ ను యథాతథంగా ఉంచారు అని తెలుసితోంది. అవసరమైతే ముంబై నుండి ఈ మూవీ యూనిట్ తిరిగి వచ్చిన తరువాత ఈ సెట్ లో  కొన్ని సీన్స్ తీస్తారు అని టాక్.  

'సాహో' కు సంబంధించి యాక్షన్ పార్ట్ మొత్తం పూర్తి కావడంతో పాటు ఈ ప్యాచ్ వర్క్ అనుకున్న విధంగా పూర్తి అవుతున్న నేపథ్యంలో  ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను కేవలం రెండు నెలలలో పూర్తి చేయడానికి ప్రత్యేక వ్యూహాలు అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది.  ఈ మూవీని ఆగస్ట్ 15న విడుదల చేయ బోతున్న నేపధ్యంలో జులై రెండవ వారం నుండి  ఈమూవీ ప్రమోషన్ ను జాతాయ స్థాయిలో భారీ ఎత్తున చేయడానికి ఒక ప్రముఖ ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థతో చర్చలు పూర్తి చేసి మనదేశం లోని అన్ని ప్రముఖ నగరాలలో ఈమూవీ ప్రమోషన్ ను  చాలా పక్కాగా చేయ బోతున్నట్లు సమాచారం.  

ఈపాటికే నేషనల్ సెలెబ్రిటీగా మారిపోయిన ప్రభాస్ ఈమూవీతో 'బాహుబలి' ఇమేజ్ నుండి బయటకు వచ్చి తన సొంత ఇమేజే ని మరింత పెంచుకోవాలని ప్రభాస్ ఆలోచన. ఈమూవీకి ఖర్చుపెడుతున్న బడ్జెట్ 300 కోట్లు దాటిపోవడంతో ఈమూవీ బిజినెస్ 500 కోట్ల స్థాయిలో జరిగినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు..  
 



మరింత సమాచారం తెలుసుకోండి: