నమ్రత మహేష్ సినిమాలకు సంబంధించి అదేవిధంగా అతడి బ్రాండ్ ఎండార్స్ మెంట్స్ గురించి విపరీతమైన శ్రద్ధ తీసుకుంటుంది. దర్శకులు మహేష్ కు చెప్పబోయే కథలను ముందుగా నమ్రత వింటుంది అన్న వార్తలు కూడ ఇండస్ట్రీ వర్గాలలో ఉన్నాయి. 

ఇలాంటి క్రియా శీలక పాత్ర పోషించే నమ్రత ‘మహర్షి’ సినిమా దగ్గరకు వచ్చేసరికి నమ్రత సలహాలు వంశీ పైడిపల్లి పై ఏమాత్రం పనిచేయడం లేదు అన్న గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి.ఈసినిమాకు సంబంధించిన ప్రమోషన్ విషయాలలో వంశీ పైడిపల్లి వ్యూహాలు ఏమిటో నమ్రతకు మాత్రమే కాదు నిర్మాత దిల్ రాజ్ కు కూడ చెప్పకుండా వంశీ పైడిపల్లి అన్నీ తానై వ్యవహరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈవిషయంలో నమ్రత తన పిఆర్ టీమ్ సలహాలను ఉపయోగించుకోమనీ సంకేతాలు పంపుతున్నా వంశీ పైడిపల్లి నుండి స్పందన లేదని టాక్. 

ఇప్పటికే ఈసినిమాకు పెరిగి పోయిన బడ్జెట్ విషయమై అనేక సార్లు రిలీజ్ వాయిదా పడిన విషయమై అసంతృప్తితో సమంత ఉన్నట్లు గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. ఈమూవీకి 130 కోట్ల వరకు బిజినెస్ అయిన నేపధ్యంలో ఈమూవీ బయ్యర్లు గట్టెక్కాలి అంటే కనీసం 150 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చి తీరాలి. 

దీనికితోడు ఈమూవీ రిలీజ్ కు ఇక కేవలం 17 రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపధ్యంలో ఈమూవీ ప్రమోషన్ గురించి ఇంకా స్పష్టమైన ప్రణాలికలు డిజైన్ అవ్వకపోవడం మహేష్ నమ్రతలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నట్లు టాక్. ఈ టెన్షన్ నుండి బయటకు వెళ్లి రిలాక్స్ అవ్వాలని కాబోలు మహేష్ నమ్రతలు తమ పిల్లలతో కలిసి అప్పుడే విదేశాలకు వెళ్ళిపోయారు. మరో వారం రోజుల తరువాత జరగబోయే ఈమూవీ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ డేట్ కు మహేష్ నమ్రతలు తిరిగి వస్తారని తెలుస్తోంది..   


మరింత సమాచారం తెలుసుకోండి: