ఆ మద్య మెగాస్టార్ చిరంజీవీ నటించిన ‘ఖైదీ నెంబర్ 150’ చిత్రంలో రత్తాలు రత్తాలు అంటూ ఉర్రూతలూగించిన బ్యూటీ రాయ్ లక్ష్మీ.  హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన రాయ్ లక్ష్మి కొంత కాలంగా సరైన హిట్స్ లేకపోవడంతో ఐటమ్స్ సాంగ్స్ తో రంజీంప జేస్తుంది.  ఆ మద్య బలుపు చిత్రంలో రవితేజ సరసన ఆడి పాడిన రాయ్ లక్ష్మి ‘కాంచన’చిత్రంలో లారెన్స్ సరసన హీరోయిన్ గా నటించింది.  కానీ ఈ చిత్రం ఆమెకు పెద్దగా పేరు తీసుకు రాలేదు.  ఇటీవల  ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి’ లాంటి హర్రర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 


ఈ చిత్రం కూడా రాయ్ లక్ష్మికి పెద్దగా పేరు తీసుకు రాలేదు. ఎన్ని చిత్రాలు లు చేసినా.. ఆమెకు మాత్రం గుర్తింపు, హిట్ అనేవి అందని ద్రాక్షగానే మారుతున్నాయి. ఈ మద్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రాయ్ లక్ష్మి.. రావలసినంత గుర్తింపు రాలేదని బాధపడుతున్నారా? అని అడిగితే ఆమె ఏం సమాధానం చెప్పిందంటే..ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత హీరోయిన్ గా కెరీర్ మొదలు పెడితే అన్నీ హిట్ చిత్రాలే ఉండాలని రూల్ లేదు.

ఆ మద్య బాలీవుడ్‌లో ‘జూలీ 2’లో అవకాశమొచ్చింది.  ఈ చిత్రం గురించి నాకు చెప్పింది ఒకటి..కానీ అందులో చూపించించిది మరొకటి. ఆ చిత్రం నాకు పెద్దగా గుర్తింపు తీసుకు రాలేదు. దానికి తోడు ఈ చిత్రంలో ఎంపికలో నేను చేసిన కొన్ని తప్పులు సక్సెస్‌ఫుల్‌ హీరోయిన్‌ అన్న పేరుకు దూరం చేశాయి. అయినా జరిగిపోయిన వాటి గురించి బాధ పడను.  ప్రస్తుతం నా కెరీర్ బాగానే ఉందని అన్నారు రాయ్ లక్ష్మి. 


మరింత సమాచారం తెలుసుకోండి: