కాంచనమాల కెబుల్ టివి సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన లక్ష్మీ రాయ్ అదేనండి ఇప్పటి రాయ్ లక్ష్మి హీరోయిన్ గా క్లిక్ అవ్వలేదు కాని గ్లామర్ డాల్ గా స్పెషల్ సాంగ్స్, స్పెషల్ క్యారక్టర్స్ తో క్రేజ్ తెచ్చుకుంది. మెగాస్టార్ చిరంజీవి ఖైది నంబర్ 150 లో రత్తాలు రత్తాలు అంటూ రచ్చ చేసిన రాయ్ లక్ష్మి.. ఆ తర్వాత మరింత క్రేజ్ తెచ్చుకుంది.


ఈమధ్యనే వేర్ ఈజ్ వెంకటలక్ష్మి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది అమ్మడు. సినిమా అవకాశాలు ఎలా ఉన్నా తనని చాలా మంది మోసం చేశారని చెప్పుకొచ్చింద్ రాయ్ లక్ష్మి. డబ్బు కోసం తనని వాడుకుని వదిలేశారని ప్రేమలో రెండు సార్లు ఫెయిల్ అయిన తను గర్భవతి అయ్యానని మీడియా వార్తలు రాయడం జరిగిందని అందులో ఏమాత్రం వాస్తవం లేదని చెప్పింది.


ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎవరు ఎలాంటి వారు అని తెలుసుకోవడం కాస్త కష్టమనిపించింది. అందరిని నమ్మి మోసపోయిందట రాయ్ లక్ష్మి. తెలుగు, తమిళ భాషల్లోనే కాదు బాలీవుడ్ జూలీ సీక్వల్ లో నటించిన అమ్మడు అక్కడ కూడా పెద్దగా క్లిక్ అవ్వలేదు. వచ్చిన ప్రతి చిన్న అవకాశాన్ని కాదనకుండా చేస్తున్న రాయ్ లక్ష్మి ప్రయోగాలకు తాను సిద్ధమని చెబుతుంది.


కోలీవుడ్ లో రాయ్ లక్ష్మికి మంచి అవకాశాలే వస్తున్నాయి. ఇన్నాళ్లు నిలబడగలిగింది అంటే అది తమిళ అవకాశాల వల్లే అని చెప్పొచ్చు. హీరోయిన్ కు తక్కువ.. స్పెషల్ పాత్రలకు ఎక్కువగా సినిమాలు చేస్తూ వస్తున్న రాయ్ లక్ష్మి కెరియర్ టర్న్ తిప్పే ఏదైనా సినిమా తగులుతుందని ఆశిస్తుంది. మరి అలాంటి ఛాన్స్ అమ్మడికి రావాలని ఆశిద్దాం.


మరింత సమాచారం తెలుసుకోండి: