నాచురల్ స్టార్ నాని హీరోగా క్రికెట్ బ్యాక్ డ్రాప్ తో గౌతం తిన్ననూరి డైరక్షన్ లో వచ్చిన సినిమా జెర్సీ. ట్రైలర్ తోనే అంచనాలు పెంచేసిన ఈ సినిమా రిలీజ్ తర్వాత ప్రేక్షకులను అలరిస్తుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తుంది. 


జెర్సీ సినిమాతో ప్రతిభ చాటిన గౌతం తిన్ననూరికి నిర్మాతలు వరుస అవకాశాలు ఇస్తున్నారు. ఇప్పటికే గౌతం తిన్ననూరిని దిల్ రాజు లాక్ చేశాడని తెలుస్తుంది. సినిమా సక్సెస్ ఫుల్ అని తెలియగానే తన బ్యానర్ లో సినిమా కాకున్నా అప్రిసియేషన్ ఈవెంట్ పెట్టాడు దిల్ రాజు. ఇదంతా ఆ డైరక్టర్ తో తన నెక్స్ట్ సినిమా ప్లానింగ్ కోసమే అంటున్నారు.


ఇప్పటికే గౌతం తిన్ననూరి దిల్ రాజుకి ఓ లైన్ చెప్పాడట. మెగా హీరో వరుణ్ తేజ్ కు సూటయ్యే ఓ కథ చెప్పాడని తెలుస్తుంది. వరుణ్ తేజ్ కు గౌతం నరేట్ చేశాడట. సో మళ్లీ రావా, జెర్సీ తర్వాత గౌతం తిన్ననూరి వరుణ్ తేజ్ తోనే సినిమా చేస్తాడని తెలుస్తుంది. అయితే జెర్సీ స్టోరీ, స్క్రీన్ ప్లే చూసిన ఎన్.టి.ఆర్, అల్లు అర్జున్ గౌతం ను ప్రశంసలతో ముంచెత్తగా వారిద్దరిలో ఎవరో ఒకరు ఛాన్స్ ఇస్తారని తెలుస్తుంది.


ప్రస్తుతం వరుణ్ తేజ్ వాల్మీకి సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత వరుణ్, గౌతం కాంబో మూవీ ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమా ఓకే అయితే దిల్ రాజు, వరుణ్ తేజ్ ల హ్యాట్రిక్ కాంబినేషన్ లో సెట్ అయినట్టే. ఫిదా, ఎఫ్-2 లతో ఒకదానికి మించి హిట్లు అందుకున్న దిల్ రాజు, వరుణ్ తేజ్ ముచ్చటగా మూడవసారి చేసే ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: