యంగ్ హీరో నిఖిల్ నటించిన సినిమాలు వరస పరాజయాలు చెందడంతో ఈహీరో కెరియర్ కొంత వరకు అయోమయంలో పడింది. ఇలాంటి పరిస్థుతులలో ఇతడు నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'అర్జున్ సురవరం' రిలీజ్ కౌంట్ డౌన్ మొదలైంది. ఈ సమ్మర్ రేస్ ను టార్గెట్ చేస్తూ మే 1న విడుదల కాబోతున్న ఈమూవీ ప్రమోషన్ ను నిఖిల్ చాలా ముందుగానే మొదలుపెట్టేశాడు. 

ఈసినిమాను ప్రమోట్ చేస్తూ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమాలో సహజత్వం కోసం తాను తిన్న 36 పోలీసు దెబ్బల గురించి వివరించాడు. ఈసినిమాలో జర్నలిస్టు పోషిస్తున్న నిఖిల్ ను ఈసినిమాలో ఒక పోలీసు పాత్ర గట్టిగా చెంప దెబ్బ కొట్టవలసిన సీన్ ఉందట. ఈ సినిమా దర్శకుడు టి ఎన్ సంతోష్ ఈ సీన్ లో సహజత్వం కోసం తనను ఆ పోలీసు పాత్ర చేత 36 సార్లు కొట్టించి చివరి షాట్ ఓకె చేసిన విషయాన్ని వివరిస్తూ ఆసీన్ టార్చర్ తాను ఇప్పట్లో మరిచిపోలేను అంటూ నిఖిల్ జోక్ చేసాడు. 

అదేవిధంగా ఈసినిమా షూటింగ్ కోసం తాను మేకప్ వేసుకుని ఉదయం 9 గంటలకు షూటింగ్ స్పాట్ కు వెళితే అనేక సార్లు ఆమూవీ షూటింగ్ అర్దరాత్రి వరకు జరిగిన సందర్భాలు ఉన్నాయని అంటూ నిఖిల్ కొన్ని ఆసక్తికర విషయాలను గుర్తుకు చేసుకున్నాడు. ఈమూవీ షూటింగ్ కు బ్రేక్ ఇవ్వకుండా ఒకేరోజు రెండు మూడు సీన్స్ తన పై తీసిన దర్శకుడు సంతోష్ కష్టం గురించి చెపుతూ షూటింగ్ స్పాట్ లో తనకు దర్శకుడు నరకం చూపించాడు అంటూ జోక్ చేసాడు.

ఈమూవీలో నిఖిల్ కు హీరోయిన్ గా లావణ్య త్రిపాఠి నటిస్తోంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఐరన్ లెగ్ హీరోయిన్ గా ముద్ర వేలించుకున్న లావణ్యకు ఈమూవీ సక్సస్ చాలా అవసరం. అయితే ఈసినిమా విడుదలైన కేవలం 8 రోజుల గ్యాప్ తో మహేష్ 'మహర్షి' విడుదల అవుతున్న నేపథ్యంలో ఈమూవీకి ఏమాత్రం డివైడ్ టాక్ వచ్చినా మహేష్ 'మహర్షి' కోసం థియేటర్లు ఖాళీ చేయవలసిన పరిస్థితి నిఖిల్ కు ఏర్పడుతుంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: