నేడు దేశ్య వ్యాప్తంగా మూడో దశ పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే.  ఇటీవల రెండో దశ పోలింగ్ లో సెలబ్రెటీలు క్యూ లైన్లో నిల్చొని ఓట్లు వేసిన విషయం తెలిసిందే.  రజినీకాంత్, కమల్ హాసన్, అజిత్, విజయ్,శృతి హాసన్ లతో పాటు సూర్య, జ్యోతిక,కార్తీ ఇలా తమిళ స్టార్ హీరోలు క్యూ లైన్లో నిల్చొని ఓటు వేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

తాజాగా కేరళలో క్యూలైనులో నిలబడి అందరితో కలిసి ఓటింగ్ లో పాల్గొన్నారు మ‌ల‌యాళ స్టార్ న‌టులు మ‌మ్ముట్టి..మోహ‌న్‌లాల్‌. కోచి, తిరువనంతపురంలోని పోలింగ్ కేంద్రాల్లో ఇద్దరు నటులు ఓటు వేశారు.

ఓటు వేసేందుకు వచ్చిన మమ్ముట్టి, మోహన్ లాల్ ను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాల వద్ద గుమిగూడారు. లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా మూడో విడుత ఎన్నికలు ఇవాళ జరుగుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: