టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’సూపర్ హిట్ అయ్యింది.  రాజకీయ నేపథ్యంలో సాగిన ఈ సినిమా మహేష్ బాబు సీఎం పాత్రలో జీవించారు.  పేద ప్రజల కోసం పోరాడే ఒక సామాన్య పౌరుడిగా సీఎం పాత్రలో నటించిన మహేష్ బాబు కి అన్ని వర్గాల నుంచి ప్రశంసలు లభించాయి.  ప్రస్తుతం వంశి పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’సినిమాలో నటిస్తున్నాడు మహేష్ బాబు.  ఈ సినిమా గురించి రక రకాల కథనాలు ఇప్పటికే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 

ఇక కథ విషయానికి వస్తే ఓ బిలీనియర్ అమెరికాలో ఎన్నో కంపెనీలు నెలకొల్పి తన ఆదిపత్యాన్ని చాటుకుంటుంటాడు.  ఇదే సమయంలో అతని స్నేహితుడు భారతదేశంలో ఓ మారుమూల పల్లెలు ఉంటాడు. అనుకోని పరిస్థితిలో అతని స్నేహితుడి కోసం మహేష్ బాబు ఇండియాకు రావడం..ఇక్కడ రైతుల సమస్యలు తెలుసుకొని ఛలించిపోయి వారికోసం తన సెలబ్రెటీ హోదాను పక్కన పెట్టి కష్టపడి ఒక సామాన్య రైతులా వారితో మమేకం అవుతాడట.

మరోవైపు స్టూడెంట్ గా కొనసాగడం ఇలా మూడు రకాల షేడ్స్ లో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.   అయితే ఈ సినిమాలో రైతు పాత్రే సినిమాకు కీలకంగా మారనుంది. ఇంట్రవెల్ సమయంలో ఈ పాత్ర ఇంట్రడ్యూస్ అవుతుందట.  పూజా హెగ్డే హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: