టాలీవుడ్ లో బాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్డే ‘ఒక లైలా కోసం’, ‘ముకుంద’సినిమాలతో చాలా సాంప్రదాయం గల అమ్మాయిలా కనిపించింది. ఇదే ఈ హీరోయిన్ కి పెద్ద మైనస్ గా మారడంతో గ్లామర్ కి అవకాశం లేక బాలీవుడ్ లోకి జంప్ అయ్యింది. కానీ అక్కడ కూడా దారుణమైన పరిస్థితి ఎదుర్కొవడంతో హరీష్ శంకర్-అల్లు అర్జన్ కాంబినేషన్ లో వచ్చిన దువ్వాడ జగన్నాథం సినిమాలో అందాల ఆరోబోతతో కుర్రాళ్లకు పిచ్చెక్కింది. ముఖ్యంగా స్విమ్మింగ్ ఫూల్ లో బికినీ సీన్లో పూజా హెగ్డె రెచ్చిపోయి మరీ నటించింది. ఆ ఒక్క సినిమా ఈ హాట్ బ్యూటీ జాతకం మార్చింది.
వరుసగా తెలుగు లో ఛాన్సులు రావడం మొదలు పెట్టాయి. ఆ మద్య సుకుమార్-రాంచరణ్ కాంబినేషన్ లో వచ్చిన ‘రంగస్థలం’సినిమాలో జిల్ జిల్ జిగేలు రాని ఐటమ్ సాంగ్ లో పూజా హెగ్డే తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. ప్రస్తుతం మహేష్ బాబు ‘మహర్షి’సినిమలో నటిస్తుంది. ఆ మద్య త్రివిక్రమ్ -ఎన్టీఆర్ కాంబినేషన్ లోవచ్చిన అరవింద సమేత సినిమాలో నటించింది. త్వరలో ప్రభాస్ తో మరో మూవీలో నటించబోతుంది. పూజా లక్ ఏ రేంజ్ లో ఉందో అర్ధమవుతుంది.
తాజాగా అల్లు అర్జున్ – త్రివిక్రమ్ సినిమాలో పూజానే హీరోయిన్ అంటూ వార్తలొస్తున్నాయి. ఇప్పుడు మరో మెగా హీరో కోసం పూజా హెగ్డే రంగంలోకి దిగుతుందనే న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో వినబడుతుంది. హరీష్ శంకర్ – వరుణ్ తేజ్ కాంబోలో తెరకెక్కుతున్న వాల్మీకి చిత్రంలో పూజా హెగ్డే నటించబోతుంది.
వాల్మీకి సినిమాలో వరుణ్ తేజ్ నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో నటించబోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ వాల్మీకి సినిమాలో ఓ ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంది. ఆ ఫ్లాష్ బ్యాక్ లో వరుణ్ తేజ్ లవర్ గా పూజా హెగ్డే కనిపించబోతోందనేది తాజా సమాచారం. డీజేతో పూజా లక్కుని మార్చేసిన హరీష్ శంకర్ అడిగాడనే పూజా బిజీ షెడ్యూల్ లోనూ వరుణ్ కి లవర్ గా నటించడానికి ఒప్పుకుందని టాక్ అయితే సోషల్ మీడియాలో వినబడుతుంది.