ఛలో సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన కన్నడ బ్యూటీ రష్మిక మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకుంది.  ఆ తర్వాత విజయ్ దేవరకొండ నటించిన ‘గీతాగోవిందం’సినిమాతో మరో ఘనవిజయం సాధించింది.  ఈ సినిమా ఏకంగా వంద కోట్ల క్లబ్ లో చేయడం రష్మికు కు బాగా కలిసి వచ్చింది.  దాంతో వరుసగా తెలుగు, తమిల, కన్నడ భాషల్లో రష్మికు ఛాన్సులు రావడం మొదలు పెట్టాయి.  ప్రస్తుతం రష్మిక అంటే టాలీవుడ్ లో హాట్ క్రేజీ హీరోయిన్ గా మారింది. ఆమెను తమ సినిమాల్లో హీరోయిన్ గా పెట్టుకునేందుకు పలువురు దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు.  అంత క్రేజ్ ఉన్న ఈ హీరోయిన్ ని ఓ దర్శకుడు ఘోరంగా ఏడిపించాడట..ఈ విషయం స్వయంగా రష్మికనే చెప్పడం మరో విశేషం.  


అయితే ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంటే మాత్రం తప్పులో కాలేసినట్లే..ఓ ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ.. గీత గోవిందం సినిమా సమయంలో జరిగిన ఓ సంఘటనను గుర్తు తెచ్చుకుంది. ఒకరోజు షూటింగ్ లొకేషన్ కు తాను ఆలస్యంగా వెళ్లానని, ఆ యూనిట్ లోని మెంబర్స్ ఎవరు తనతో సరిగ్గా మాట్లాడలేదట. దాంతో అసలే కొత్త..తన సహనటులు ఎవరూ పలకరించకపోవడంతో ఎంతో బాధవేయడం...ఆ భాద నుంచి కన్నీరు రావడం జరిగిందట. కొద్ది సేపటి తర్వాత దర్శకుడు పరుశరామ్ వచ్చి..ఇదంతా కావాలనే చేశామని.. అసలు విషయం చెప్పడంతో తేరుకున్నానని చెప్పింది.

ఇంతకీ దర్శకుడు ఏమి చెప్పాడో తెలుసా .. రష్మిక సహజంగా బాధపడుతున్నప్పుడు ఉండే హావభావాలను కెమెరాలో బంధించేందుకు ఇలా ప్లాన్ చేశామని చెప్పాడట. పరశురామ్ పైకి కనిపించడు కానీ మహా అల్లరోడు కదా ! నిజంగా రష్మికను ఏడిపించిన దర్శకుడు ఆమెనుండి గొప్ప నటనను రాబట్టే ప్రయత్నం చేసాడన్నమాట. ఈ సంఘటన గుర్తుకు వచ్చినప్పుడల్లా తనకు భలే నవ్వు వస్తుందని అన్నారు రష్మిక. 



మరింత సమాచారం తెలుసుకోండి: