మహర్షి సినిమాలోని పాటలు ఇప్పటివరకు విడుదలైనవి ఏవి కూడా అనుకున్నంత రేంజ్ లో హిట్ కాలేదు. ఈ సినిమా అడియోను ఒక్కోసాంగ్ లెక్కన ఆన్ లైన్ లోకి విడుదల చేస్తూ వస్తున్నారు. ఇప్పటికి మూడుపాటలు బయటకు వచ్చాయి. మహేష్ అభిమానులను, తన అభిమానులను కూడా సంగీత దర్శకుడు దేవీ తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ మూడు పాటలు కూడా మహేష్ సినిమా రేంజ్ కు మ్యాచ్ అయ్యేలా లేవు అన్నది వాస్తవం.


ఇప్పుడు నాలుగో పాట బయటకు వస్తోంది. పదరా.. పదరా.. అనే శ్రీమణి రాసిన పాట బుధవారం విడుదల చేస్తున్నారు. శంకర్ మహదేవన్ పాడారీ పాటను. ఈ పాట మీద సినిమా యూనిట్ మొత్తం చాలా హోప్ తో వుంది. ఈపాటే సినిమాకు హైలైట్ అవుతుందని అంటోంది. అంతేకాదు, ఈ పాటను చిత్రకరించడానికి కాస్త భారీగానే ఖర్చు చేసారు.


భరత్ అనే నేను సినిమాలో 'వచ్చాడయ్యా.. సామీ' అనే సాంగ్ టైపులో ఇది కూడా మహర్షి అడియోకు, సినిమాకు హైలైట్ అవుతుందని అంటున్నారు. వాస్తవానికి ఈ సాంగ్ ను చివర్న విడుదల చేద్దామనుకున్నారు. కానీ ఎప్పుడయితే విడుదల చేసిన మూడు పాటలు హిట్ కాకపోవడం, సినిమాకు బజ్ రాకపోవడంతో ముందుగానే విడుదల చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: