ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో టీం ఇండియా కెప్టెన్ ధోనితో రాంచరణ్ నటించబోతున్నాడు. బ్యాట్ తో కళ్లు చెదిరిపోయే షాట్లు కొట్టే ధోనితో రాంచరణ్ స్టెప్పులు వేయనున్నాడు.

జంజీర్ ఫ్లాఫ్ అయిన తర్వాత బాలీవుడ్ లో ఇక ఇప్పట్లో నటించను అని రాంచరణ్ చెబుతున్నాడు గా అప్పుడే నిర్ణయం మార్చుకున్నాడా.. అని అనుకోవద్దు, కారణం వీరిద్దరు నటించేది సినిమాలో కాదు, ఒక వాణిజ్య ప్రకటనలో.

అయితే దీనికి కూడా సినిమా డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తుండడం విశేషం. పెప్సి వారి యాడ్ లో దోని, రాంచరణ్ తో త్రివిక్రమ్ డ్యాన్స్ చేయించనున్నాడట. త్వరలోనే షూటింగ్ జరుపుకుని బుల్లి తెరపై వీరిద్దరి కాంబినేషన్ అదరగొట్టబోతోంది. ఈ యాడ్ కోసం రాంచరణ్ కు రూ.4కోట్లు రెన్యుమరేషన్ కాగా, ధోనికి రూ.6 కోట్లు ఇస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: