సూపర్ స్టార్ మహేష్ 25వ సినిమాగా వస్తున్న మహర్షి సినిమా మే 9న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. వంశీ పైడిపల్లి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను దిల్ రాజు, అశ్వనిదత్, పివిపి ముగ్గురు బడా నిర్మాతలు కలిసి నిర్మిస్తున్నారు. సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుండగా అల్లరి నరేష్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు.


రిలీజ్ ఇంకా రెండు వారాలు మాత్రమే ఉండటంతో సినిమా రిలీజ్ హంగామా మొదలైంది. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ అదరగొడుతుండగా రిలీజ్ ఈవెంట్ కూడా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారట. మే 1న మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగనుందట. ఈ ఈవెంట్ లో స్పెషల్ గెస్టులుగా మహేష్ ను డైరెక్ట్ చేసిన దర్శకులందరు వస్తారని తెలుస్తుంది.


మహర్షి మహేష్ 25వ సినిమా కావడంతో మహేష్ తో ఇప్పటివరకు తీసిన దర్శకులందరికి మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇన్విటేషన్ వెళ్లనుందట. వారే ఈ ఈవెంట్ కు ప్రధాన ఆకర్షణ అంటున్నారు. ఇక వారితో పాటుగా చిత్రయూనిట్ మొత్తం మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొంటుందని తెలుస్తుంది. మహేష్ బాబు మహర్షి సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు.


ఈ మధ్య రిలీజైన టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా నుండి ఇప్పటివరకు రిలీజైన సాంగ్స్ పెద్దగా మెప్పించలేదు. వంశీ పైడిపల్లి నిర్మాత దిల్ రాజు మాత్రం ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఆలోచింపచేస్తుందని అంటున్నారు. మరి మహేష్ మహర్షి సంచలనాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలంటే రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: