గతంలో ఓ సినిమా స్టోరీ ఏంతో తెలియాలంటే రిలీజ్ అయ్యేదాకా ఆగాలి. కాని ఇప్పుడు పరిస్దితి మారింది. ఓ ప్రక్క లీకులు మరో ప్రక్క ఊహాగానాలు అంటూ రకరకాల కథలు ప్రచారంలోకి వచ్చేస్తున్నాయి. ట్రైలర్ చూసి కథ చెప్పేసే స్దాయిలో జనం క్రియేటివిటీ పెరిగిపోయింది.  అంతెందుకు సినిమా లోగో చూస్తే చాలు. కథను కొంతవరకూ అంచనా వేసేస్తున్నారు.


చాలాసార్లు అసలు కథ కన్నా, ఈ కొసరు కథలే చాలా బాగుంటున్నాయి. చాలా వరకూ కరెక్ట్ అవుతున్నాయి, కనెక్ట్ అవుతున్నాయి కూడా. తాజాగా అదే పద్దతిలో ‘మహర్షి’ విజువల్స్ హాట్ టాపిక్ గా మారింది.  ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి డైరక్షన్ లో మహేష్‌బాబు చేస్తున్న తాజా చిత్రం ‘మహర్షి’. ఈ చిత్రం ఇప్పటికే విడుదలైన ప్రమోషన్ చిత్రాలతో ప్రేక్షకులు, అభిమానుల్లో భారీ అంచనాలు మొదలయ్యాయి. ఈ నేపధ్యంలో ఈ చిత్రం కథ ఏమైంటుందనే ఊహాగానాలు సైతం మొదలయ్యాయి.


రీసెంట్ గా మహర్షి సినిమా మేకర్స్ ఒక చిత్రాన్ని చూపిస్తూ ‘పాడారు పాడారు’ అనే పాటను రిలీజ్ చేశారు. ఆ పాటలో మహేష్ పొలం దున్నుతున్న చిత్రం ఫ్యాన్స్ లో ఆసక్తిని రేపుతుంది. మహేష్ చిత్రం రైతుల కాన్సెప్ట్ కి చెందినదని ఊహాగానాలు వ్యక్తమవ్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: