తెలుగు ఇండస్ట్రీలో మహేష్ బాబు, వంశి పైడిపల్లి కాంబినేషన్ లో ‘మహర్షి’చిత్రం రాబోతుంది.  ఈ చిత్రంలో మహేష్ బాబు మూడు డిఫరెంట్ రోల్స్ లో కనిపించబోతున్నారట.  అమెరికాలో ఓ మల్టీ బిలీనియర్ గా.. సామాన్య  రైతుగా, కాలేజ్ విద్యార్థి ఇలా మూడు రకాల పాత్రల్లో కనిపించబోతున్నారట. ఇందులో రైతు పాత్ర అందరి గుండెల్ని హత్తుకునేలా ఉండబోతుందని చిత్ర యూనిట్ తెలిపింది. 

ఆ మద్య భరత్ అనే నేను చిత్రంతో సీఎం పాత్రలో నటించి మెప్పించిన మహేష్ బాబు ఇప్పుడు ‘మహర్షి’ చిత్రంలో మూడు భిన్నమైన పాత్రల్లో నటించి ఏ రేంజ్ లో మెప్పించబోతున్నారో అర్థం అవుతుంది.  మహేష్ బాబు మహర్షి సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.  ఈ సినిమాలోని 4 వ సాంగ్ పదరా పదరా ఈరోజు సాయంత్రం రిలీజ్ కాబోతున్నది. 

తాజాగా మహేష్ ఫ్యాన్స్ కి శుభవార్త..మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్ మే 1 వ తేదీ సాయంత్రం 6 గంటలకు నెక్లస్ రోడ్లో జరగబోతున్నది.  ఈ ఈవెంట్ కు మహర్షి టీమ్ తో పాటు స్పెషల్ గెస్ట్ కూడా వస్తున్నారట.   కాకపోతే ఈ కార్యక్రమానికి గెస్ట్ ఎవరు అన్న విషయంపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. మే 9 వ తేదీన రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్.  అల్లరి నరేష్ కీలక పాత్రను పోషిస్తున్నాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: